యాప్నగరం

పవిత్ర నది సంగమం వద్ద ఐశ్వర్యా రాయ్ బచ్చన్

భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్య బచ్చన్, తన తల్లి వృందా రాయ్‌లతో కలిసి ఐశ్వర్యా రాయ్ బచ్చన్...

TNN 5 Aug 2017, 4:23 pm
తన తండ్రి అస్తికల్ని కలిపేందుకు అలహాబాద్‌లోని పవిత్ర నది సంగమం వద్దకి వెళ్లారు ఐశ్వర్యా రాయ్ బచ్చన్. భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్య బచ్చన్, తన తల్లి వృందా రాయ్‌లతో కలిసి ఐశ్వర్య అలహాబాద్ వచ్చారన్న సంగతి తెలుసుకున్న అభిమానులు తమ అభిమాన నటిని చూసేందుకు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఇదే ఏడాది మార్చి 18న ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తండ్రి కృష్ణరాజ్ రాయ్ తుదిశ్వాస విడిచారు. తండ్రి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కోసం ఈరోజు ఉదయం ఆమె అలహాబాద్ వద్ద నది సంగమంలో తండ్రి అస్తికల్ని కలిపి ప్రత్యేక పూజలు జరిపారు.
Samayam Telugu aishwarya visits allahabad with abhishek to immerse ashes of her late father
పవిత్ర నది సంగమం వద్ద ఐశ్వర్యా రాయ్ బచ్చన్


ఈ కార్యక్రమం కోసం ఓ బోట్ క్లబ్ సహాయం తీసుకున్న ఐష్.. బోటులో వెళ్లి నది మధ్యలో దాదాపు గంటసేపు ప్రత్యేక పూజలు జరిపినట్టు తెలుస్తోంది. అనంతరం తన కుటుంబంతో కలిసి వారాణాసి వెళ్లారామె.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.