యాప్నగరం

వెండితెరను షేక్ చేయడానికి ‘మిస్టర్ మజ్ను’ వస్తున్నాడు!

ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో ‘మిస్టర్ మజ్ను’గా అఖిల్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

Samayam Telugu 13 Dec 2018, 7:09 am
టాలీవుడ్‌లో అక్కినేని కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినీ పరిశ్రమను ఏలగా.. ఆయన తనయుడు నాగార్జున లవర్ బాయ్‌గా ఓ వెలుగు వెలిగారు. అయితే నేటితరం అక్కినేని హీరోలకు మాత్రం ఆ స్థాయి ఇమేజ్ రాలేదు. అడపాదడపా హిట్లతో నాగచైతన్య రాణిస్తున్నా.. అఖిల్ మాత్రం ఇంకా హిట్ ట్రాక్‌లోకి ఎక్కలేదు. తొలి సినిమా ‘అఖిల్’ తీవ్రంగా నిరాశపరిచింది. ఇక రెండో సినిమా ‘హలో’ కూడా ఊహించిన స్థాయిలో లేదు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో ‘మిస్టర్ మజ్ను’గా అఖిల్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
Samayam Telugu Mr_Majnu


వరుణ్ తేజ్‌తో ‘తొలిప్రేమ’ లాంటి హిట్ సినిమాను తెరకెక్కించిన వెంకీ అట్లూరి ‘మిస్టర్ మజ్ను’కు దర్శకత్వం వహిస్తున్నారు. అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ భామ ఇటీవలే నాగచైతన్య సరసన ‘సవ్యసాచి’లో నటించింది. అయితే, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై బీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ బుధవారం ప్రకటించారు.

ఒక పాట మినహా షూటింగ్ పూర్తయిందని ప్రసాద్ వెల్లడించారు. ఈ చిత్రంలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేయబోతున్నామని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రిపబ్లిక్ డేకు ఒకరోజు ముందు చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని చెప్పారు. కాగా, ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం సమకూర్చారు. శ్రీమణి సాహిత్యం అందించారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వెంకీ అట్లూరి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.