పెళ్లి తర్వాత... అక్కినేని నాగ చైతన్య, సమంత.. జంటగా నటించనున్న చిత్రం షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వెళ్తూ... చైతూ తన ట్విట్టర్లో సమంతాతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశాడు. 'ఇది ఖచ్చితంగా కొత్త రోజే.. నా శ్రీమతితో షూటింగ్కి వెళుతున్నాను. మీకు మరింత ఆనందాన్ని అందించనున్నాము... శుభోదయం!!!' అని ట్వీట్ చేశారు. హరీష్ పెద్ది, సాహు గరపాటి సంయుక్తంగా షైన్ స్క్రీన్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు
చైతూ, సమంత కాంబినేషన్లో ఇది నాలుగవ చిత్రం కావడం విశేషం. చిత్రానికి 'ప్రేయసి' అనే టైటిల్ను దర్శక, నిర్మాతలు పరిశీలిస్తున్నారు. పెళ్లికి ముందు వీరిద్దరూ... ఏం మాయ చేశావే, ఆటోనగర్ సూర్య, మనం చిత్రాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చైతు నటించిన 'సవ్యసాచి' ఫస్ట్లుక్ విడుదలై... వైరల్గా మారింది. మరోపక్క సమంత నటించిన 'రంగస్థలం' సినిమా విడుదలకు ముస్తాబవుతుంది.
This is definetley a new day .. heading to work with the mrs .. a fun campaign coming your way .. good morning !!! pic.twitter.com/DxSAz9KlBU — chaitanya akkineni (@chay_akkineni) March 17, 2018
చైతూ, సమంత కాంబినేషన్లో ఇది నాలుగవ చిత్రం కావడం విశేషం. చిత్రానికి 'ప్రేయసి' అనే టైటిల్ను దర్శక, నిర్మాతలు పరిశీలిస్తున్నారు. పెళ్లికి ముందు వీరిద్దరూ... ఏం మాయ చేశావే, ఆటోనగర్ సూర్య, మనం చిత్రాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చైతు నటించిన 'సవ్యసాచి' ఫస్ట్లుక్ విడుదలై... వైరల్గా మారింది. మరోపక్క సమంత నటించిన 'రంగస్థలం' సినిమా విడుదలకు ముస్తాబవుతుంది.
This is definetley a new day .. heading to work with the mrs .. a fun campaign coming your way .. good morning !!! pic.twitter.com/DxSAz9KlBU — chaitanya akkineni (@chay_akkineni) March 17, 2018