యాప్నగరం

Allu Arjun ‘అల..’పై టీడీపీ ఎంపీ ఆసక్తికర ట్వీట్

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

Samayam Telugu 18 Jan 2020, 9:21 pm
అల.. వైకుంఠపురములో చిత్రం చూసిన ప్రేక్షకుల మదిని మెచ్చిన పాట‘సిత్తరాల సిరపడు’. టాలీవుడ్‌లో మారుమోగుతున్న ఈ జానపదే గేయాన్ని ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంలో సందర్భోచితంగా ఉపయోగించుకుని హైప్ తీసుకువచ్చారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. క్లైమాక్స్ కీలకమైన ఫైట్‌ను ఈ పాటతో ముగింపు ఇవ్వడం ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది.
Samayam Telugu Sitharala Sirapadu
అల్లు అర్జున్, రామ్మోహన్ నాయుడు



‘సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పట్టు పట్టినాడా ఒగ్గనే ఒగ్గడు.. పెత్తనాలు నడిపేడు సిత్తరాల సిరపడు
ఊరూరు ఒగ్గేసినా ఉడుంపట్టు ఒగ్గడు’ అంటూ శ్రీకాకుళం యాసలో వచ్చే ఈ అచ్చతెలుగు జానపద గేయం సినీ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్నిచేస్తుంది. ఎల్ ఐసీ సీనియర్ ఉద్యోగి బల్లా విజయకుమార్ రాసిన ఈ పాటపై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు శ్రీకాకుళం జిల్లా వాసి, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.

‘అల.. వైకుంఠపురములో శ్రీకాకుళం జానపద గీతాల చరిత్రను దృష్టిలో ఉంచుకుని మా వాడుక భాషలో రాసిన 'సిత్తరాల సిరపడు' విని చాలా ఆనందించాను. ఈ జిల్లా సంస్కృతి సాహిత్యం తెలుగువాళ్ళకి చెప్పిన దర్శకులు, రచయిత, గేయకర్తకు కృతఙ్ఞతలు’.. అంటూ ట్వీట్ చేస్తూ అల్లు అర్జున్‌కి థాంక్స్ చెప్పారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఈ సందర్భంగా ‘అల్లు అర్జున్ స్టైలిష్ ఫైట్.. ఈ పాటకు పర్ఫెక్ట్‌గా సరిపోయింది’ అని అన్నారు రామ్మోహన్ నాయుడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.