యాప్నగరం

‘అల..’ సక్సెస్ సెలబ్రేషన్స్: సాగరతీరంలో భారీ ఏర్పాట్లు

‘అల వైకుంఠపురములో’ విజయోత్సవ వేడుకలను విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో హీరోహీరోయిన్లు అల్లు అర్జున్, పూజా హెగ్డేతో పాటు దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు తమన్ పాల్గొంటున్నారు.

Samayam Telugu 19 Jan 2020, 6:21 pm
సాగర నగరం విశాఖపట్నంలో ‘అల వైకుంఠపురములో’ సందడి మొదలైంది. ఇప్పటికే చిత్ర హీరోహీరోయిన్లు అల్లు అర్జున్, పూజా హెగ్డే పాటు దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు తమన్ వైజాగ్ చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఆర్కే బీచ్‌లో సెలబ్రేషన్స్ మొదలుకానున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వేలలో బన్నీ అభిమానులు ఈ వేడుకలో పాల్గొననున్నారు.
Samayam Telugu Ala_Success
‘అల వైకుంఠపురములో’ విజయోత్సవ వేడుకలు


కాగా, సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ‘అల వైకుంఠపురములో’ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి వారం రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.118 కోట్ల షేర్ వసూలుచేసింది. ఇది నాన్-బాహుబలి రికార్డ్. సినిమా ఇంతటి ఘనవిజయం సాధించడంతో చిత్ర బృందం విజయోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. నేడు వైజాగ్‌లో, జనవరి 24న తిరుపతిలో విజయోత్సవ వేడుకలను నిర్వహిస్తారు.
ఇదిలా ఉంటే, ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే, తమన్, త్రివిక్రమ్ వైజాగ్ బయలుదేరి వెళ్లారు. వైజాగ్‌లో వీరికి బన్నీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి బన్నీని అభిమానులు ర్యాలీగా తీసుకెళ్లారు. కాగా, 6 గంటలకు ప్రారంభమయ్యే ‘అల వైకుంఠపురములో’ సక్సెస్ సెలబ్రేషన్స్ లైవ్‌ను కింది వీడియోలో చూడొచ్చు.
See Photo Story: 100% లవ్ లుక్‌లో గార్జియస్ తమన్నా హాట్ ఫొటోలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.