యాప్నగరం

వైరల్ అవుతున్న అల్లు అర్జున్ పిల్లల ఫోటోలు... పోస్టు చేసిన స్నేహ

అయాన్ అర్హ ఇద్దరు రెయిన్ కోట్లు ధరించి గార్డెన్‌లో నిలబెట్టారు. దీంతో స్నేహ వారిద్దరూ ఫోటోల్ని తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ ఫోటోల్ని బన్నీ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.

Samayam Telugu 12 Jul 2020, 2:12 pm
సినీ ప్రముఖులే కాదు.. వారి ఫ్యామిలీ కూడా ఏం చేసిన హాట్ టిపక్‌గా మారుతోంది. నిమిషాల్లో ఆ వార్త వైరల్ అయిపోతుంది. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బన్నీ భార్య స్నేహా రెడ్డి తమ ఇద్దరు పిల్లలకు చెందిన ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ ఫోటోల్ని బన్నీ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. స్నేహ పోస్టు చేసిన ఫోటోల్లో బన్నీ పిల్లలు అయాన్, అర్హలు రెయిన్ కోట్ ధరించి వర్షంలో నిలుచొని ఉన్నారు. దీంతో ఆ ఫోటోల్ని కెమెరాలో బంధించారు. అందమైన గార్డెన్‌లో కలర్ రెయిన్ కోట్స్ ధరించి ఉన్న ఇద్దరు చిన్నారులు చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఈ ఫోటోల్ని బన్నీ వైఫ్ ఇనస్టాలో పోస్టు చేశారు.
Samayam Telugu రెయిన్ కోట్‌లలో అర్హ, అయాన్


బన్నీతో పాటు.. మహేష్ బాబు ఫ్యామిలీ కూడా తమ పిల్లల ఫోటోల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటారు. తమ పిల్లలకు సంబంధించిన అన్నిరకాల అప్ డేట్స్‌ని కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
View this post on Instagram ❤️ A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on Jul 11, 2020 at 5:27am PDT

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.