యాప్నగరం

Allu Arjun : ఫ్యామిలీతో అల్లు అర్జున్ వెకేష‌న్‌.. బ్యూటీఫుల్ పిక్ షేర్ చేసిన స్నేహ‌

ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ పుష్ప ది రూల్ (Pushpa The Rule) సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. అల్లు అర్జున్ ఈ సినిమా రూల్ కోసం లుక్‌ను ఇంకాస్త కొత్తగా మార్చుకున్నారు కూడా. ఇంకా షూటింగ్ స్టార్ట్ కావ‌టానికి స‌మ‌యం ఉండ‌టంతో అల్లు అర్జున్.. స‌తీమ‌ణి స్నేహారెడ్డి (Allu Sneha Reddy), పిల్ల‌లు అయాన్‌, అర్హ‌ల‌తో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్లారు. ఫ్యామిలీతో క‌లిసి ఆఫ్రికాలో టాంజానియా(Tanzania)కు వెళ్లారు.

Authored byతుమ్మల మోహన్ | Samayam Telugu 5 Jul 2022, 1:41 pm
Samayam Telugu అల్లు అర్జున్ ఫ్యామిలీ
Allu Arjun Family
‘పుష్ప ది రైజ్’ చిత్రంతో పాన్ ఇండియా బాకాఫీస్‌ను కొల్ల‌గొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun). తనదైన స్టైల్, స్వాగ్‌తో బ‌న్నీ అభిమానుల‌ను, ప్రేక్ష‌కుల‌నే కాదు.. సెల‌బ్రిటీల‌ను సైతం ఆక‌ట్టుకున్నారు. అంద‌రూ అల్లు అర్జున్ డైలాగ్స్‌, డాన్సుల‌ను ఇమిటేట్ చేస్తూ రీల్ వీడియోల‌ను రూపొందించిన సంగ‌తిని మ‌నం మ‌ర‌చిపోలేం. ఇప్పుడు ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ పుష్ప ది రూల్ (Pushpa The Rule) సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. అల్లు అర్జున్ సైతం పుష్ప ది రైజ్ (Pushpa The Rise) నుంచి త‌న లుక్‌ను మార్చ‌కుండా కొన‌సాగిస్తున్నారు. పుష్ప ది రూల్ కోసం లుక్‌ను ఇంకాస్త కొత్తగా మార్చుకున్నారు కూడా.

ఇంకా షూటింగ్ స్టార్ట్ కావ‌టానికి స‌మ‌యం ఉండ‌టంతో అల్లు అర్జున్.. స‌తీమ‌ణి స్నేహారెడ్డి (Allu Sneha Reddy), పిల్ల‌లు అయాన్‌, అర్హ‌ల‌తో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్లారు. ఫ్యామిలీతో క‌లిసి ఆఫ్రికాలో టాంజానియా(Tanzania)కు వెళ్లారు. అక్క‌డ ఫేమ‌స్ పార్కులో అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ చ‌క్క‌టి ఫొటో దిగారు. ఆ ఫొటోను అల్లు స్నేహా రెడ్డి త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఫొటో చాలా బావుంద‌ని, చ‌క్క‌టి ఫ్యామిలీ అంటూ ఫ్యాన్స్‌, ఫాలోవ‌ర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)


ఇక పుష్ప ది రూల్ విష‌యానికి వ‌స్తే శేషాచ‌లం అడ‌వుల్లో అరుదుగా దొరికే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోతున్న సినిమా. పుష్ప ది రైజ్‌కి కొన‌సాగింపు. ఇందులో పుష్ప‌రాజ్ (Pushparaj) పాత్ర‌లో బ‌న్నీ క‌నిపించ‌బోతున్నారు. చంద‌నం స్మ‌గ్లింగ్‌లో కూలీగా చేరిన పుష్ప‌రాజ్..సిండికేట్ అధినేతగా ఎలా మారాడో తొలి భాగంలో ద‌ర్శ‌కుడు సుకుమార్ (Sukumar) ఎలివేట్ చేశారు. ఇప్పుడు రెండో భాగంలో పుష్ప‌రాజ్‌.. భైరాంసింగ్ షెకావ‌త్ మ‌ధ్య గొడ‌వేంటి? అనే విష‌యాల‌ను చూపించ‌బోతున్నారు. ర‌ష్మిక మంద‌న్న ఇందులో హీరోయిన్‌గా న‌టించ‌నుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్, ముత్తం శెట్టి మీడియా సినిమాను నిర్మిస్తున్నారు.
రచయిత గురించి
తుమ్మల మోహన్
మోహ‌న్ కుమార్ తుమ్మ‌ల స‌మ‌యం తెలుగులో డిజిట‌ల్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఇక్కడ సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్, వార్తలను రాస్తుంటారు. మోహ‌న్ కుమార్‌కి సినీ జ‌ర్న‌లిజంలో 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. గ‌తంలో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల్లో సినీ జ‌ర్న‌లిస్టుగా వ‌ర్క్ చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.