యాప్నగరం

తాగి డ్రైవ్ చేయొద్దు.. సభ్యసమాజానికి డీజే మెసేజ్

హైదరాబాద్‌లో చాలామందికి ట్రాఫిక్ రూల్స్ తెలిసినా వాటిని పాటించడం లేదన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

TNN 19 Jul 2017, 3:16 pm
హైదరాబాద్‌లో చాలామందికి ట్రాఫిక్ రూల్స్ తెలిసినా వాటిని పాటించడం లేదన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సిటీలో రోడ్డు ప్రమాదాలను బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలలో చైతన్యం కల్పించేందుకు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్న అల్లు అర్జున్ ఒక హీరోగానే కాకుండా ఒక పౌరుడిగా సమాజంపై తనకు భాద్యత ఉందని అందుకే తన వంతుగా సభ్యసమాజానికి మెసేజ్ ఇస్తున్నానన్నారు.
Samayam Telugu allu arjun speech about road accidents
తాగి డ్రైవ్ చేయొద్దు.. సభ్యసమాజానికి డీజే మెసేజ్


‘చాలా మంది ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాళ్ల ప్రాణాలను తీసుకోవడంతో పాటు ఎదటి వారి ప్రాణాలను కూడా తీసేస్తున్నారని, తాగి వాహనాలు నడిపి అనేక రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారంటూ అవేదన వ్యక్తం చేశారు. మీరు చేసే చిన్న పొరపాటు వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. దయచేసి తాగి వాహనాలు నడపొద్దని అన్నారు. ట్రాఫిక్స్ రూల్స్ అవగాహన కార్యక్రమంలో తాను పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ఇలాంటి అవైర్‌నెస్ ప్రోగ్రామ్స్ అంటే తనకు చాలా ఇష్టమన్నారు.

I Thank Hyderabad Traffic Police for the Wonderful awareness Program they Hosted . Thank you for Inviting me as one of the Chief Guests. — Allu Arjun (@alluarjun) July 19, 2017
‘ట్రాఫిక్ రూల్స్ పాటించండి మనతో పాటు ఎదుటి వారి ప్రాణాలను కాపాడండి’అంటూ అల్లు అర్జున్ సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంతో అల్లు అర్జున్‌తో పాటు దర్శకధీరుడు రాజమౌళి, నగర పోలీసు కమిషనర్‌, ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రవీందర్‌, డీసీపీ రంగనాథ్‌, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.