యాప్నగరం

రంగంలోకి అల్లువారబ్బాయి.. రేపు పవన్‌ను కలవనున్న బన్నీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా క్షణం తీరిక లేకుండా గడుపుతోన్న పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. డీహైడ్రేషన్ కారణంగా ఆయన ఆరోగ్యంగా కాస్త క్షీణించింది.

Samayam Telugu 8 Apr 2019, 12:53 pm
తాను స్వయంగా ప్రచారంలో పాల్గొనకపోయినా తన మద్దతు ఎప్పుడూ జనసేన పార్టీకి ఉంటుందని ఇటీవలే అల్లు అర్జున్ స్పష్టం చేశారు. నరసాపురం నుంచి ఎంపీ బరిలో ఉన్న నాగబాబుకు తన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్‌, జనసేన పార్టీల రాజకీయ ప్రయాణం విజయవంతం కావాలని అభిలసించారు. అయితే, అల్లు అర్జున్ ప్రకటనపై అప్పుడు అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రచారానికి రాకుండా ఇలా ట్విట్టర్ల ద్వారా మద్దతులెందుకంటూ పెదవి విరిచారు. కానీ, వారందరికీ బన్నీ ఇప్పుడు శుభవార్త తెలియజేశారు.
Samayam Telugu Pawan_Bunny


ఎన్నికల ప్రచారంలో భాగంగా క్షణం తీరిక లేకుండా గడుపుతోన్న పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. డీహైడ్రేషన్ కారణంగా ఆయన ఆరోగ్యంగా కాస్త క్షీణించింది. వైద్యులు ప్రచారం ఆపేయమని సలహా ఇచ్చినా పవన్ మాత్రం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ప్రయత్నిస్తున్నారు. మళ్లీ ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ను రామ్ చరణ్ పరామర్శించారు. ఆదివారం విజయవాడ వెళ్లిన చరణ్.. అక్కడ బాబాయ్‌ను చూసి చాలా బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ చాలా వీక్‌గా ఉన్నారని, డాక్టర్లు ప్రచారం వద్దని చెబుతున్నా వినడంలేదని చరణ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

ఇప్పుడు బన్నీ కూడా పవన్‌ను పరామర్శించడానికి వెళ్తున్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో వెళ్లనున్న అల్లు అర్జున్.. అక్కడ నుండి పాలకొల్లు వెళ్లి పవన్ కళ్యాణ్‌ను పరామర్శిస్తారు. ఆయనకి మద్దతు పలుకుతారు. ఆ తరువాత నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి కె.నాగబాబును కలిసి ఆయనకు మద్దతు ప్రకటిస్తారు. మొత్తానికి ఎన్నికలకు మూడు రోజుల ముందు జనసేన శ్రేణుల్లో ఉత్తేజం నింపడానికి అల్లు అర్జున్ వెళ్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.