డీజే దూకుడు మామూలుగా లేదు. ఇప్పటికే ఫస్ట్ లుక్ , టీజర్, సాంగ్స్తో యూట్యూబ్ను షేక్ చేసిన దువ్వాడ జగన్నాథం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్కు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు కంప్లీన్ కావడంతో ఈ రోజు (సోమవారం) రాత్రి ఏడున్నర గంటలకు ట్రైలర్ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
అయితే డీజే టీజర్ రిలీజ్కు కొన్ని రోజులు ముందు ప్రకటన చేసి విడుదల చేయగా.. ట్రైలర్ను మాత్రం చడీచప్పుడు లేకుండా విడుదల చేస్తున్నారు. అయితే టీజర్తో కథపై క్లారిటీ ఇచ్చిన హరీష్ ఈ ట్రైలర్ను మూవీపై హైప్ వచ్చేవిధంగా 2 నిమిషాల నిడివితో కట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల డీజేలోని ‘గుడిలో బడిలో మడిలో ఒడిలో’ సాంగ్కు రెస్పాన్స్ అదిరిపోవడంతో పాటు వివాదానికి కూడా కారణమైంది. అయితే సినిమాకు ఈ వివాదం ఒక రకంగా ప్లస్ అయిందనే చెప్పాలి. ఈ టైమ్లోనే ట్రైలర్ను రిలీజ్ చేస్తే మరింత హైప్ వచ్చే అవకాశం ఉండటంతో హడావిడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇదిలాఉంటే టీజర్తోటే రికార్డుల మోతమోగించిన ‘డీజే’మూవీ.. థియేట్రికల్ ట్రైలర్ అంతకుమించి సంచలనాలను నమోదు చేయండం ఖాయం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మొత్తానికి దువ్వాడ దూకుడు ఈరోజు రాత్రి ఏడున్నర గంటలకు మొదలుకాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. జూన్ 23న ప్రపంచ వ్యాప్తంగా ‘డీజే ’ మూవీ థియేటర్స్లో సందడి చేయనుంది.
Super Duper excited Guys ..... Sharp....... 7.30 Pm Today 👍👍 pic.twitter.com/D3AGWBi3TZ — Harish Shankar .S (@harish2you) June 5, 2017
అయితే డీజే టీజర్ రిలీజ్కు కొన్ని రోజులు ముందు ప్రకటన చేసి విడుదల చేయగా.. ట్రైలర్ను మాత్రం చడీచప్పుడు లేకుండా విడుదల చేస్తున్నారు. అయితే టీజర్తో కథపై క్లారిటీ ఇచ్చిన హరీష్ ఈ ట్రైలర్ను మూవీపై హైప్ వచ్చేవిధంగా 2 నిమిషాల నిడివితో కట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల డీజేలోని ‘గుడిలో బడిలో మడిలో ఒడిలో’ సాంగ్కు రెస్పాన్స్ అదిరిపోవడంతో పాటు వివాదానికి కూడా కారణమైంది. అయితే సినిమాకు ఈ వివాదం ఒక రకంగా ప్లస్ అయిందనే చెప్పాలి. ఈ టైమ్లోనే ట్రైలర్ను రిలీజ్ చేస్తే మరింత హైప్ వచ్చే అవకాశం ఉండటంతో హడావిడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇదిలాఉంటే టీజర్తోటే రికార్డుల మోతమోగించిన ‘డీజే’మూవీ.. థియేట్రికల్ ట్రైలర్ అంతకుమించి సంచలనాలను నమోదు చేయండం ఖాయం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మొత్తానికి దువ్వాడ దూకుడు ఈరోజు రాత్రి ఏడున్నర గంటలకు మొదలుకాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. జూన్ 23న ప్రపంచ వ్యాప్తంగా ‘డీజే ’ మూవీ థియేటర్స్లో సందడి చేయనుంది.
Super Duper excited Guys ..... Sharp....... 7.30 Pm Today 👍👍 pic.twitter.com/D3AGWBi3TZ — Harish Shankar .S (@harish2you) June 5, 2017