యాప్నగరం

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన నవనీత్ కౌర్.. భవిష్యత్‌ తరాల కోసం తప్పదన్న ఎంపీ

సినీనటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించారు. ఈ కార్యక్రమం ఎంతో మంచిదని, భవిష్యత్ తరాలకు మేలు చేస్తుందని తెలిపారు.

Samayam Telugu 6 Oct 2020, 2:54 pm
తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు ప్రముఖులు స్పందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని సెలబ్రెటీలు, ప్రముఖులు ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. దీనిలో భాగంగానే ప్రముఖ సినీనటి, అమరావతి(మహారాష్ట్ర) లోక్‌సభ సభ్యురాలు నవనీత్ కౌర్ మొక్కలు నాటారు.
Samayam Telugu మొక్కలు నాటుతున్న నవనీత్ కౌర్


Also Rea: కాజల్ పెళ్లి ముహూర్తం ఫిక్స్.. అఫీషియల్‌గా ప్రకటించిన నటి

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘కొద్ది నెలలుగా సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రెటీలతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. మా తోటి పార్లమెంట్ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి కావాలనుకున్నాను. ఈ ఛాలెంజ్ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుందని, ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ గారికి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృంద సభ్యులకు మద్దతుగా నిలవాలన్న ఉద్దేశంతోనే నేను కూడా మొక్కలు నాటాను. ఈ ఛాలెంజ్‌లో అందరూ పాల్గొని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు.

Also Rea: షకలక శంకర్‌కు చేదు అనుభవం... విజయవాడ పోలీసులపై అసహనం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.