విదేశాల్లో వ్యాపారం నిర్వహిస్తున్న కొన్ని కంపెనీలకు అమితాబ్ బచ్చన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా వ్యవహరిస్తున్నారని పనామా పేపర్ లీక్స్ ఉదంతం అనంతరం అనేక ఆరోపణలు వినిపించాయి. కానీ పనామా పేపర్ లీక్ ఆరోపణలపై స్పందించిన బచ్చన్ మాత్రం అదంతా ఉత్తుత్తి ఆరోపణలే అని కొట్టిపారేశారు. వార్తల్లో కథనాలు వచ్చినట్టుగా తనకి విదేశాల్లో ఎటువంటి వ్యాపారాలు లేవని... ఏ విధంగానూ తనకి ఆ కంపెనీలతో సంబంధం లేదని అమితాబ్ తేల్చిచెప్పారు. ఇదిలావుంటే, పనామా పేపర్ లీక్స్ నిజమేనని చెబుతూ మరోసారి అమితాబ్కి సంబంధించి ఇంకొన్ని వార్తలొస్తున్నాయి. విదేశాల్లో వున్న కంపెనీలకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా వ్యవహరించిన అమితాబ్... ఇక్కడి నుంచే టెలిఫోనిక్ కాన్ఫరెన్స్ల ద్వారా వారితో సంప్రదింపులు జరిపేవారని ఆయా కథనాలు చెబుతున్నాయి. ఈసారి ఈ ఆరోపణలపై అమితాబ్ ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి!
కంపెనీ డైరెక్టర్లలో ఒకరిగా అమితాబ్ ఫోన్లో మాట్లాడేవారట
విదేశాల్లో వ్యాపారం నిర్వహిస్తున్న కొన్ని కంపెనీలకు అమితాబ్ బచ్చన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా వ్యవహరిస్తున్నారని పనామా పేపర్ లీక్స్
TNN 21 Apr 2016, 8:41 pm