యాప్నగరం

Short Film On Coronavirus: చిరు, రజినీ, అమితాబ్ షార్ట్ ఫిల్మ్.. టెలికాస్ట్ ఎప్పుడంటే!

చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్, రజనీకాంత్, ప్రియాంక చోప్రా, రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌ తదితర స్టార్స్ అంతా కరోనా వైరస్‌పై యుద్ధం ప్రకటించారు. ఈ వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. షార్ట్ ఫిల్మ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Samayam Telugu 6 Apr 2020, 1:56 pm
కరోనాపై పోరాటానికి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు ఏకం అయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతు ప్రకటిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు, నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్లు వీడియో సందేశాలు ఇవ్వగా.. సంగీత దర్శకులు కోటీ, కీరవాణి, కుంచె రఘులు స్వరపరిచిన కరోనా సాంగ్స్ వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో సూపర్ స్టార్స్, మెగాస్టార్స్ అందరూ ఈ కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా మరో అడుగు ముందుకు వేశారు.
Samayam Telugu short film on Coronavirus
కరోనా షార్ట్ ఫిల్మ్‌లో మెగాస్టార్, సూపర్ స్టార్


చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్, రజనీకాంత్, ప్రియాంక చోప్రా, రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌తో పాటు తదితర స్టార్స్ అంతా ‘ఫ్యామిలీ’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. ప్రసూన్‌ పాండే దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిలింలో బిగ్ బీ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మిగిలిన స్టార్లు భాగం అవుతున్నారు. సోమవారం రాత్రి 9గంటలకు సోనీ నెట్‌వర్క్‌లో ఈ షార్ట్ ఫిల్మ్ ప్రసారం కానుంది. కోవిడ్ 19 ప్రభావంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ షార్ట్‌ ఫిలింను రూపొందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.