ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మళయాళ ముద్దుగుమ్మల హడావిడి ఎక్కువైపోయింది. నయనతార, నిత్య మీనన్లు ఇప్పటికే తెలుగులో తమ జెండాను పాతారు. సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లాంటి వారు కూడా తమ సత్తాను చాటాడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో మరో మళయాళ బ్యూటీ తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంది. మియాజార్జ్ అనే మలయాళ ముద్దుగుమ్మ పలు తమిళ, మళయాళ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు తెలుగులో క్రాంతి మాధవ్ రూపొందిస్తోన్న సినిమాలో హీరోయిన్గా ఈమెను ఫైనల్ చేశారు. సునీల్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గ్లామర్తో పాటు చక్కటి అభినయాన్ని కనబరచాలి. మియాజార్జ్ అయితే ఆ పాత్రకు పర్ఫెక్ట్ అని భావించిన చిత్రయూనిట్ ఆమెని ఎంపిక చేశారు.
తెలుగు సినిమాల్లోకి మరో కేరళ బ్యూటీ!
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మళయాళ ముద్దుగుమ్మల హడావిడి ఎక్కువైపోయింది. నయనతార, నిత్య మీనన్లు ఇప్పటికే..
Samayam Telugu 4 Sep 2016, 4:40 pm