యాప్నగరం

అమ్మతో అనసూయ: ఫొటో షేర్ చేసిన యాంకర్.. అమ్మ కాదు అక్క అంటోన్న నెటిజన్స్

తన తల్లికి అనసూయ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మతో తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన ఫాలోవర్లతో పంచుకున్నారు. ఈ ఫొటోకు మంచి స్పందన వస్తోంది.

Samayam Telugu 24 Sep 2020, 8:39 pm
ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆమె ఎప్పుడూ తన ఫొటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుత మోడరన్ లైఫ్‌కు తగ్గట్టు ట్రెండీ డ్రెస్సుల్లో మెరిసే అనసూయ.. ఫొటోషూట్‌లు చేస్తూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఫొటోలకు బోలెడంత మంది ఫాలోవర్లు. ఇన్‌స్టాగ్రామ్‌లో అనసూయను ఇష్టపడేవాళ్లు ఎంత మంది ఉన్నారో హేటర్స్ కూడా అదే స్థాయిలో ఉన్నారు. ఆమె ఎప్పుడు ఏ ఫొటోను, వీడియోను పోస్ట్ చేసినా ఏదో ఒకటి వల్గర్ కామెంట్ చేస్తూనే ఉంటారు.
Samayam Telugu Anasuya Bharadwaj
అనసూయ భరద్వాజ్


అయితే, గురువారం అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక ఫొటో అందరినీ ఆకర్షిస్తోంది. దీనికి కారణం ఆ ఫొటోలో అనసూయతో పాటు ఆమె తల్లి అనురాధ కూడా ఉండటమే. ఈరోజు అనురాధ పుట్టినరోజు. ఈ సందర్భంగా అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, తన తల్లితో కలిసి తీసుకున్న సెల్ఫీని అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోను చూసినవాళ్లంతా అనసూయకు అనురాధ అమ్మలా లేరని, అక్కలా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు.

See Photos: పొట్టి డ్రెస్‌లో అనసూయ.. కిక్కెక్కించే లుక్

‘‘ఐ లవ్ యు అమ్మ. నువ్వు ఆరోగ్యంగా ఉండాలని, నీకు మనశ్శాంతి ఉండాలని ఈ పుట్టినరోజు నాడు భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ బర్త్‌డే అమ్మ’’ అని అనసూయ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘మా అమ్మ దృఢశాలి’ అని కూడా అనసూయ అన్నారు.
View this post on Instagram I love you Ma 😘 I pray for your good health and peace of mind on this birthday 😇 #HappyBirthdayMa 🥳 #MyMomTheStrongest 🧿 @anuradha_khasba ❤️ A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on Sep 24, 2020 at 6:30am PDT
తన తల్లి గురించి ఇటీవల ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో మాట్లాడుతూ అనసూయ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా జీవితంలో మా అమ్మ చాలా ముఖ్యం. ఆమె మా కోసం ఎంత కష్టపడిందో నాకు తెలుసు. ఆమె చీరలు కుట్టి.. మాకు బట్టలు కొనేది. అప్పట్లో ఆర్డినరీ బస్‌లతో పాటు మెట్రో బస్‌లు ఉండేవి. మెట్రో బస్‌లో వెళ్లాలంటే అర్ధరూపాయి ఎక్కువ. ఆ అర్ధరూపాయి కోసం.. నేను రెండు బస్ స్టాప్‌లు నడిచి వెళ్లేదాన్ని. ఇంటి అద్దె కట్టలేక చాలా ఇళ్లులు మారేవాళ్లం’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు అనసూయ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.