యాప్నగరం

జర్నలిస్ట్‌గా యాంకర్ అనసూయ!

ఇప్పటికే క్షణం, సోగ్గాడే చిన్నినాయన, విన్నర్ లాంటి సినిమాల్లో తళుక్కుమన్న యాంకర్ అనసూయ ఇటీవలే 'సచ్చిందిగా గొర్రె' అనే హారర్ కామెడీ...

TNN 30 Oct 2017, 4:40 pm
నటుడు మంచు మోహన్ బాబు ప్రస్తుతం గాయత్రి అనే సినిమా షూటింగ్‌లో బిజీగా వున్న సంగతి తెలిసిందే. మదన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో హీరో మంచు విష్ణు కూడా నటిస్తున్నాడు. తాజాగా అందుతున్న ఫిలింనగర్ అప్‌డేట్స్ ప్రకారం ఈ సినిమాలో జబర్ధస్ యాంకర్ అనసూయ ఓ ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే క్షణం, సోగ్గాడే చిన్నినాయన, విన్నర్ లాంటి సినిమాల్లో తళుక్కుమన్న అనసూయ ఇటీవలే 'సచ్చిందిగా గొర్రె' అనే హారర్ కామెడీ సినిమాకు సైన్ చేసింది. ఇదిలావుండగా తాజాగా మోహన్ బాబు, మంచు విష్ణు నటిస్తున్న గాయత్రి సినిమాలో అనసూయ ఓ జర్నలిస్ట్ పాత్రకు సైన్ చేసినట్టు సమాచారం.
Samayam Telugu anchor anasuyas key role in mohan babus next
జర్నలిస్ట్‌గా యాంకర్ అనసూయ!


ఈ సినిమాలో విష్ణు సరసన నిఖిలా విమల్ జంటగా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం వుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.