యాప్నగరం

వీడితో ఏం చేస్తాం అని నో అన్నారు: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరశురాం దర్శకత్వంలో వచ్చిన ‘గీత గోవిందం’ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

Samayam Telugu 19 Aug 2018, 4:06 pm
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరశురాం దర్శకత్వంలో వచ్చిన ‘గీత గోవిందం’ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మంచి కలెక్షన్లతో బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. వినూత్నమైన ప్రేమకథా చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్ర యూనిట్‌ను అభినందించారు. కాగా, యాంకర్ సుమ తాజాగా ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురాం, హీరోహీరోయిన్లు విజయ్, రష్మికలను ఇంటర్వ్వూ చేశారు.
Samayam Telugu Vijay_Devarakonda


ఇంటర్వ్యూలో భాగంగా విజయ్ దేవరకొండ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. చిత్రంలో గీత పాత్ర కోసం దర్శక, నిర్మాతలు సుమారు 25 మంది అమ్మాయిలను పరిశీలించారట. వీళ్లలో సుమారు ఎనిమిది మంది పేర్లు విజయ్ దేవరకొండ వద్దకు వెళ్లాయి. అయితే వాళ్లలో చాలా మంది నో చెప్పారట. ‘స్టార్ హీరోలుండగా ఈ విజయ్ గాడితో ఏం చేస్తాం’ అని వాళ్లంతా నో చెప్పారని విజయ్ వెల్లడించారు. అయితే ఈ విషయం తనతో చెప్పలేదని దర్శకుడు పరశురాంతో అన్నారని తెలిపారు.

వాస్తవానికి ఈ సినిమాను విజయ్ అంగీకరించిన సమయానికి ‘అర్జున్‌రెడ్డి’ విడుదల కాలేదు. అందుకే విజయ్ అంటే ఎవరో తెలియక హీరోయిన్లు నో చెప్పి ఉంటారని సుమ అభిప్రాయపడ్డారు. మరిన్ని విశేషాల కోసం ఈ ఇంటర్వ్యూ చూడండి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.