యాప్నగరం

అట్టహాసంగా ఏఎన్నార్ అవార్డ్స్.. శ్రీదేవి, రేఖకు పురస్కారాల ప్రధానం

ప్రతిష్టాత్మక ఏఎన్నార్ నేషనల్ అవార్డులను 2018 సంవత్సరానికి దివంగత నటి శ్రీదేవికి, 2019 సంవత్సరానికి సంబంధించి నటి రేఖకు అందజేశారు. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అట్టహాసంగా జరిగింది.

Samayam Telugu 17 Nov 2019, 8:30 pm
దిగ్గజ నటుడు, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఏర్పాటుచేసిన ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్‌ను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును కిందటేడాది ఎవరికీ ఇవ్వలేదు. అందుకని, ఈ ఏడాదితోపాటు గత సంవత్సర అవార్డును కలుపుకుని ఇప్పుడు ప్రకటించారు. 2018 సంవత్సరానికి గాను దివంగత నటి శ్రీదేవికి, 2019 సంవత్సరానికి గాను ప్రముఖ నటి రేఖకు ఏఎన్నార్ నేషనల్ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది.
Samayam Telugu ANR Awards
ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్


Also Read: ఆమె నిండు గర్భిణి.. ఏఎన్నార్ సినిమా.. ఆసక్తికర కథ చెప్పిన చిరంజీవి

ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా ఈ అవార్డులను అందజేశారు. శ్రీదేవి తరఫున ఆమె భర్త బోనీ కపూర్ అవార్డును అందుకున్నారు. అలాగే రేఖకు చిరంజీవి అవార్డును అందజేశారు.

Also Read: మీరు చెప్పింది తప్పు.. వేదికపై నాగార్జునకు కౌంటర్ ఇచ్చిన రేఖ

కాగా, ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సినీ ప్రముఖులంతా పాల్గొన్నారు. అక్కినేని కుటుంబ సభ్యులు అమల, నాగ సుశీల, నాగచైతన్య, సుమంత్, సుశాంత్, అఖిల్‌తో పాటు అక్కినేని అవార్డ్స్ కమిటీ చైర్మన్ టి.సుబ్బరామిరెడ్డి, హీరో విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.