‘అంతకు మించి’ వివాదంపై స్పందించిన హీరో
యాంకర్ రష్మీ, సతీస్ జాయ్ జంటగా నటించిన ‘అంతకు మించి’ సినిమాపై గౌరీశంకర్ ప్రసాద్ అనే నిర్మాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Samayam Telugu 25 Aug 2018, 4:04 pm
యాంకర్ రష్మీ, సతీస్ జాయ్ జంటగా నటించిన ‘అంతకు మించి’ సినిమాపై గౌరీశంకర్ ప్రసాద్ అనే నిర్మాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనను మోసం చేయడమే కాకుండా, కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ సినిమా విడుదల చేశాడంటూ గౌరీశంకర్ చేసిన ఆరోపణలపై హీరో సతీష్ జాయ్ స్పందించాడు.
సతీష్ ఓ టీవీ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘గౌరీ శంకర్ చేస్తున్న ఆరోపణలు ఫేక్. అతను సినిమాకు రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టాడని చెప్పడం అవాస్తవం. కన్నా, భాను, సతీష్ అనే ముగ్గురం కలిసి ఈ సినిమా నిర్మించాం. ఈ సినిమాకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఏడాది కిందటే గౌరీశంకర్ రాసిచ్చాడు’’ అని తెలిపాడు.
Read also: వివాదంలో ‘అంతకు మించి’ సినిమా!
రష్మీ చెప్పాకే తెలిసింది: ‘‘ఈ సినిమాపై కోర్టు స్టే విధించిన విషయం నాకు తెలీదు. ఆ రోజు రాత్రి రష్మీ ఫోన్ చేసి.. సినిమాకు స్టే ఆర్డర్ వచ్చిందట నిజమేనా అని అడింది. అప్పటి వరకు నాకు స్టే వచ్చిన సంగతి తెలీదు. మా సినిమాకు హైప్ రావడంతో బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ ఆరోపణలు చేస్తున్నాడు. ఆయన డబ్బు ఇచ్చినట్లు సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే చూపించమనండి’’ అని సతీష్ జాయ్ తెలిపాడు.
సతీష్ ఓ టీవీ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘గౌరీ శంకర్ చేస్తున్న ఆరోపణలు ఫేక్. అతను సినిమాకు రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టాడని చెప్పడం అవాస్తవం. కన్నా, భాను, సతీష్ అనే ముగ్గురం కలిసి ఈ సినిమా నిర్మించాం. ఈ సినిమాకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఏడాది కిందటే గౌరీశంకర్ రాసిచ్చాడు’’ అని తెలిపాడు.
Read also: వివాదంలో ‘అంతకు మించి’ సినిమా!
రష్మీ చెప్పాకే తెలిసింది: ‘‘ఈ సినిమాపై కోర్టు స్టే విధించిన విషయం నాకు తెలీదు. ఆ రోజు రాత్రి రష్మీ ఫోన్ చేసి.. సినిమాకు స్టే ఆర్డర్ వచ్చిందట నిజమేనా అని అడింది. అప్పటి వరకు నాకు స్టే వచ్చిన సంగతి తెలీదు. మా సినిమాకు హైప్ రావడంతో బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ ఆరోపణలు చేస్తున్నాడు. ఆయన డబ్బు ఇచ్చినట్లు సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే చూపించమనండి’’ అని సతీష్ జాయ్ తెలిపాడు.