సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘బాహుబలి: ది కన్క్లూజన్’. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రచయిత, జర్నలిస్ట్.. అనుపమా చోప్రా ‘బాహుబలి’ చిత్ర బృందాన్ని ఆ సినిమా సెట్లోనే ఇంటర్వ్యూ చేశారు. చిత్ర బృందం ఆ వీడియోను ట్విటర్లో పోస్టు చేసింది.
‘బాహుబలి’ కోసం చిత్ర బృందం ఎంతో కష్టపడిందని దర్శకుడు రాజమౌళి అన్నారు. సినిమా విడుదలైన వారం తర్వాత లాంగ్ ట్రిప్కు వెళ్లాలనుకుంటున్నానని ఆయన చెప్పారు. దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టు ఇదేనని, రాజమౌళితో తనకున్న అనుబంధం కారణంగానే ఈ సినిమా ఒప్పుకున్నానని హీరో ప్రభాస్ తెలిపారు. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అని ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అడుగుతున్నారని సత్యరాజ్ పేర్కొన్నారు. ఈ ప్రశ్నకు సమాధానం తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదని, ఎవరు ఎన్నిసార్లు అడిగినా తనకు విసుగురాదని ఆయన తెలిపారు.
ఎంతో మంది పెద్ద దర్శకులతో పనిచేసిన తనకు రాజమౌళితో పనిచేయడం కొత్త అనుభూతిని ఇచ్చిందని ఆర్ట్ డైరెక్టర్ సాబుశిరిల్ పేర్కొన్నారు. అందుకే అయిదేళ్లపాటు విసుగులేకుండా, ఉత్సాహంగా పని చేశానని ఆయన వివరించారు. రాజమౌళి తనకు సన్నివేశాల గురించి చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయానని ఆయన తెలిపారు. 18 నిమిషాల నిడివి ఉన్న ఈ ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు నెట్లో సందడి చేస్తోంది.
‘బాహుబలి’ కోసం చిత్ర బృందం ఎంతో కష్టపడిందని దర్శకుడు రాజమౌళి అన్నారు. సినిమా విడుదలైన వారం తర్వాత లాంగ్ ట్రిప్కు వెళ్లాలనుకుంటున్నానని ఆయన చెప్పారు. దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టు ఇదేనని, రాజమౌళితో తనకున్న అనుబంధం కారణంగానే ఈ సినిమా ఒప్పుకున్నానని హీరో ప్రభాస్ తెలిపారు. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అని ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అడుగుతున్నారని సత్యరాజ్ పేర్కొన్నారు. ఈ ప్రశ్నకు సమాధానం తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదని, ఎవరు ఎన్నిసార్లు అడిగినా తనకు విసుగురాదని ఆయన తెలిపారు.
ఎంతో మంది పెద్ద దర్శకులతో పనిచేసిన తనకు రాజమౌళితో పనిచేయడం కొత్త అనుభూతిని ఇచ్చిందని ఆర్ట్ డైరెక్టర్ సాబుశిరిల్ పేర్కొన్నారు. అందుకే అయిదేళ్లపాటు విసుగులేకుండా, ఉత్సాహంగా పని చేశానని ఆయన వివరించారు. రాజమౌళి తనకు సన్నివేశాల గురించి చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయానని ఆయన తెలిపారు. 18 నిమిషాల నిడివి ఉన్న ఈ ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు నెట్లో సందడి చేస్తోంది.