యాప్నగరం

ప్రపంచంలో ఎక్కడికెళ్లినా అదే ప్రశ్న అడుగుతున్నారట!

రచయిత, జర్నలిస్ట్‌.. అనుపమా చోప్రా ‘బాహుబలి’ చిత్ర బృందాన్ని ఆ సినిమా సెట్‌లోనే ఇంటర్వ్యూ చేశారు.

TNN 9 Mar 2017, 7:56 pm
సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’. ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రచయిత, జర్నలిస్ట్‌.. అనుపమా చోప్రా ‘బాహుబలి’ చిత్ర బృందాన్ని ఆ సినిమా సెట్‌లోనే ఇంటర్వ్యూ చేశారు. చిత్ర బృందం ఆ వీడియోను ట్విటర్‌‌లో పోస్టు చేసింది.
Samayam Telugu anupama chopras interview with rajamouli and team
ప్రపంచంలో ఎక్కడికెళ్లినా అదే ప్రశ్న అడుగుతున్నారట!


‘బాహుబలి’ కోసం చిత్ర బృందం ఎంతో కష్టపడిందని దర్శకుడు రాజమౌళి అన్నారు. సినిమా విడుదలైన వారం తర్వాత లాంగ్‌ ట్రిప్‌‌కు వెళ్లాలనుకుంటున్నానని ఆయన చెప్పారు. దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టు ఇదేనని, రాజమౌళితో తనకున్న అనుబంధం కారణంగానే ఈ సినిమా ఒప్పుకున్నానని హీరో ప్రభాస్‌ తెలిపారు. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అని ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అడుగుతున్నారని సత్యరాజ్‌ పేర్కొన్నారు. ఈ ప్రశ్నకు సమాధానం తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదని, ఎవరు ఎన్నిసార్లు అడిగినా తనకు విసుగురాదని ఆయన తెలిపారు.

ఎంతో మంది పెద్ద దర్శకులతో పనిచేసిన తనకు రాజమౌళితో పనిచేయడం కొత్త అనుభూతిని ఇచ్చిందని ఆర్ట్‌ డైరెక్టర్‌ సాబుశిరిల్‌ పేర్కొన్నారు. అందుకే అయిదేళ్లపాటు విసుగులేకుండా, ఉత్సాహంగా పని చేశానని ఆయన వివరించారు. రాజమౌళి తనకు సన్నివేశాల గురించి చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయానని ఆయన తెలిపారు. 18 నిమిషాల నిడివి ఉన్న ఈ ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు నెట్‌లో సందడి చేస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.