యాప్నగరం

‘అర్జున్ రెడ్డి’ తరవాత ‘షుగర్ ఫ్యాక్టరీ’!

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.

TNN 1 Sep 2017, 9:56 am
‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎగబడుతున్నారు. ఒకప్పుడు సందీప్ కూడా అందరిలానే కథలు పట్టుకొని నిర్మాతల చుట్టూ తిరిగాడు. కానీ ఆయనకు ఎక్కడా అవకాశం దొరకకపోవడంతో తన అన్నయ్యతో కలసి నిర్మాతగా మారి సినిమా చేసుకోవాల్సి వచ్చింది. అదే ‘అర్జున్ రెడ్డి’. సినిమా సూపర్ హిట్ అయింది. వసూళ్లు కూడా బాగా వస్తున్నాయి.
Samayam Telugu arjun reddy directors next movie sugar factory
‘అర్జున్ రెడ్డి’ తరవాత ‘షుగర్ ఫ్యాక్టరీ’!


నిజానికి ఈ సినిమా కంటే ముందు సందీప్ ‘షుగర్ ఫ్యాక్టరీ’ అనే క్రైమ్ థ్రిల్లర్ కథను సిద్ధం చేసుకొని అందరికీ వినిపించాడట. కానీ నిర్మాతలు మాత్రం ఆయనను నమ్మలేకపోయారు. పైగా క్రైమ్ స్టోరీ ఎందుకని మరేదైనా స్క్రిప్ట్ రెడీ చేసుకోమని సలహా ఇచ్చారట. దీంతో ఆ ‘షుగర్ ఫ్యాక్టరీ’ని పక్కన పెట్టి.. ‘అర్జున్ రెడ్డి’ కథను తయారు చేసుకున్నాడు. ఆ కథను కూడా ఏ నిర్మాత యాక్సెప్ట్ చేయలేదు. దీంతో ఆయనే స్వయంగా ‘అర్జున్ రెడ్డి’ని నిర్మించాడు.

అయితే ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ సక్సెస్‌తో నమ్మకం సంపాదించిన సందీప్.. ‘షుగర్ ఫ్యాక్టరీ’ కథను బయటకు తీస్తున్నాడు. సందీప్ కావాలనుకుంటే ఈ సినిమాను నిర్మించడానికి నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారు. కానీ ‘షుగర్ ఫ్యాక్టరీ’ చిత్రాన్ని మాత్రం తానే నిర్మిస్తానని.. అది తనకు బాగా నచ్చిన స్క్రిప్ట్ అని సందీప్ అంటున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో, నటీనటులు ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.