యాప్నగరం

Me Too: పబ్లిసిటీ కోసమే ‘మీటూ’ రాతలు.. సీనియర్ నటుడు అశ్రానీ

‘‘ సినిమా ప్రమోషన్లలో భాగంగా కొందరు దీన్ని పబ్లిసిటీకి వాడుకుంటున్నారు. వీటిలో 90 శాతం అసత్యాలు. పత్రికల ద్వారా పాపులారిటీ సంపాదించేందుకే ఇలా చేస్తున్నారు’’ అంటూ ఆ సినియర్ నటుడు ‘మీటూ’పై మండిపడ్డారు.

Samayam Telugu 12 Oct 2018, 12:11 pm
#MeToo ఉద్యమం అంతా బూటకమని, పాపులారిటీ కోసమే అలాంటి రాతలు రాస్తున్నారంటూ బాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు అశ్రానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అశ్రానీ హిందీలో షోలే‌తోపాటు 350 సినిమాల్లో నటించారు. ఆరు సినిమాలకు దర్శకత్వం వహించారు. మీటూపై ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu Untitled1


‘‘నేను మహిళలను గౌరవిస్తాను. ప్రతి ఒక్కరూ గౌరవించాలి కూడా. సినిమా ప్రమోషన్లలో భాగంగా కొందరు దీన్ని పబ్లిసిటీకి వాడుకుంటున్నారు. వీటిలో 90 శాతం అసత్యాలు. పత్రికల ద్వారా పాపులారిటీ సంపాదించేందుకే ఇలా చేస్తున్నారు. వీటిని సీరియస్‌గా తీసుకోవల్సిన అవసరం లేదు. మహత్మాగాంధీ ఆటో బయోగ్రఫీ రాస్తే ఎవరూ చదవరు. అదే మాధురీ దీక్షిత్ లేదా మధుబాల ఆటోబయోగ్రఫీలు రాస్తే ప్రజలు ఎగబడి చదువుతారు’’ అని పేర్కొన్నారు.

న్యూయార్క్‌లో హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్ స్టెన్‌తో ఏడాది కిందట ప్రారంభమైన ఈ #MeToo ఉద్యమం ఇప్పుడు ఇండియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వివిధ రంగాలకు చెందిన మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేదించినవారి పేర్లను బయటపెడుతూ వణుకు పెట్టిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నానా పాటేకర్‌పై నటి తనుశ్రీ దత్త లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన రోజు నుంచి ఇండియాలో మీటూ ఉద్యమంగా సాగుతోంది. అయితే, సీనియర్ నటుడు అశ్రానీ వ్యాఖ్యలపై మీటూ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.