యాప్నగరం

సీఎం కోసం రూ. 2 కోట్లతో అసెంబ్లీ సెట్!

సీఎం గారి కోసం రూ. 2 కోట్లతో అసెంబ్లీ సెట్ వేస్తున్నారు. ఆయన రావడమే ఆలస్యం 40 రోజులపాటు వాడివేడిగా సమావేశాలు..

TNN 27 Aug 2017, 7:10 pm
వరుస సినిమాలతో బిజీగా ఉన్న మహేశ్ బాబు ‘స్పైడర్’ పాట కోసం రొమేనియా వెళ్లారు. ఆయన అక్కడి నుంచి తిరిగి రాగానే ‘భరత్ అనే నేను’ సినిమా షూటింగ్‌లో బిజీ కానున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో రూ. 2 కోట్లతో అసెంబ్లీ సెట్ వేస్తున్నారు. వరుసగా 40 రోజుల పాటు చిత్రీకరణ జరిపేందుకు చిత్రయూనిట్ ప్రణాళికలు రూపొందిస్తోంది. గతంలో మహేశ్‌తో శ్రీమంతుడు సినిమా తీసిన కొరటాల శివనే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తోన్న ‘స్పైడర్’ సినిమాను రూ. 120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండగా.. భరత్ అనే నేను మూవీని కూడా రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందించనున్నట్లు సమాచారం.
Samayam Telugu assembly set is being erected at annapurna studio with 2 crs for mahesh babus next
సీఎం కోసం రూ. 2 కోట్లతో అసెంబ్లీ సెట్!


మహేశ్ సీఎంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కైరా అద్వానీ, తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ నటిస్తున్నారు. ఈ మూవీకి కొరటాల డైలాగ్‌లు హైలెట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘స్పైడర్’ ప్రభావంతో ఈ మూవీ తమిళంలో కూడా మంచి షేర్ సాధించే అవకాశాలు ఉన్నాయని నిర్మాతలు భావిస్తున్నారు.

#SPYder still...! @urstrulyMahesh @Rakulpreet pic.twitter.com/AW0RRVsVjx — Spyder (@SpyderTheMovie) August 27, 2017
స్పైడర్ మూవీ విషయానికి వస్తే.. సెప్టెంబర్ 27న దసరా కానుకగా విడుదల కానుంది. ఈ మూవీలో మహేశ్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.