యాప్నగరం

రెహ్మాన్ పాటపాడితే లేచి వెళ్లిపోయారా? ఏమైందబ్బా!

భారతీయ సంగీత సంచలనం, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ కంపోజర్‌‌గానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కచేరీలు నిర్వహిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు.

TNN 14 Jul 2017, 4:28 pm
భారతీయ సంగీత సంచలనం, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ కంపోజర్‌‌గానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కచేరీలు నిర్వహిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సౌత్ ఇండియన్ మ్యూజిక్ డైరక్టర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారంటే ఆయన పాటకు ఉన్న పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాని తాజాగా ఆయన నిర్వహించిన లండన్ కన్సర్ట్‌‌లో రెహ్మాన్ పాటపాడుతుంటే కొందరు లేచివెళ్లిపోవడం హాట్ టాపిగ్‌గా మారింది.
Samayam Telugu audience walk out of ar rahman concert
రెహ్మాన్ పాటపాడితే లేచి వెళ్లిపోయారా? ఏమైందబ్బా!


అసలువిషయానికి వస్తే.. ఏ ఆర్ రెహ్మాన్ జూలై 8న లండన్‌లో ‘నేత్రు ఇంద్రు నలై (నిన్న ఈరోజు రేపు)’ పేరుతో ఓ షో నిర్వహించారు. హిందీ, తమిళ్ అభిమానులు సహా కొన్నివేల మంది కన్సర్ట్‌కు హాజరయ్యారు. అయితే.. రెహ్మాన్ మొత్తంగా తమిళ పాటలనే పాడుతుండడంతో ఉత్తరాది ప్రవాసులు కన్సర్ట్ మధ్యలోనే అసహనంగా వెళ్లిపోయారు.

ఏఆర్ రెహ్మాన్ హిందీ సాంగ్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారిని అలాంటి హిందీ సాంగ్స్ పాడకుండా మొత్తం తమిళ పాటలే పాడుతున్నారంటూ భాషా విభేదం చూపిచారంటూ ఆవేశంతో ఊగిపోయారు రెహ్మాన్ హిందీ ఫ్యాన్స్. అంతేకాదు ఆ షో నుండి బయటకు వచ్చి ‘నేత్రు ఇంద్రు నలై’ షో నిర్వాహకులు తమను మోసం చేశారంటూ తమ డబ్బులు వాపస్ ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా అసహనాన్ని వెళ్లగక్కారు. అయితే ట్విట్టర్‌లో ఈ షో దుమారం అంతకంతకూ ముదురుతుండటంతో రెహ్మాన్ తన ఫ్యాన్స్‌ను ఎలా శాంతింపచేస్తాడో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.