ఈ ఏడాది ప్రకటించనున్న ఆస్కార్స్ అవార్డ్స్కి భారత్ తరపున నామినేట్ అయ్యే చిత్రంగా న్యూటన్ సినిమాను ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు సీక్రెట్ బ్యాలెట్ అనే ఇరానియన్ చిత్రాన్ని కాపీ చేసి న్యూటన్ సినిమాను తెరకెక్కించారు అని న్యూటన్ సినిమా దర్శకుడు, నిర్మాతలు ఆరోపణలు ఎదుర్కుంటుండగా.. మరోవైపు బాహుబలి 2 లాంటి బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ చిత్రం వుండగా న్యూటన్ సినిమాను ఎందుకు ఎంపిక చేశారు అనే విమర్శలు సోషల్ మీడియాలో చర్చనియాంశమయ్యాయి.
ఆస్కార్స్కి బాహుబలి 2 సినిమాను ఎంపిక చేయాలనే డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై స్పందించిన బాహుబలి సిరీస్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. తాను అవార్డ్స్ కోసం సినిమాను తెరకెక్కించలేదు అని అన్నారు. '' తాను నమ్మిన కథను అందంగా తెరకెక్కించడం కోసం, తనని నమ్మి పెట్టుబడి పెట్టిన వారికి డబ్బులొస్తే చాలు అనే ఉద్దేశంతోనే సినిమాలు తీస్తాను తప్ప అవార్డ్స్ కోసం కాదు" అని ఎంతో వినమ్రంగా వివరణ ఇచ్చారు రాజమౌళి. 'అవార్డ్స్ వస్తే, సంతోషమే.. కానీ అవాడ్స్ రాలేదే అనే ఆవేదన అయితే తనకి వుండదు' అని స్పష్టంచేశారు జక్కన్న.
ఆస్కార్స్కి బాహుబలి 2 సినిమాను ఎంపిక చేయాలనే డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై స్పందించిన బాహుబలి సిరీస్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. తాను అవార్డ్స్ కోసం సినిమాను తెరకెక్కించలేదు అని అన్నారు. '' తాను నమ్మిన కథను అందంగా తెరకెక్కించడం కోసం, తనని నమ్మి పెట్టుబడి పెట్టిన వారికి డబ్బులొస్తే చాలు అనే ఉద్దేశంతోనే సినిమాలు తీస్తాను తప్ప అవార్డ్స్ కోసం కాదు" అని ఎంతో వినమ్రంగా వివరణ ఇచ్చారు రాజమౌళి. 'అవార్డ్స్ వస్తే, సంతోషమే.. కానీ అవాడ్స్ రాలేదే అనే ఆవేదన అయితే తనకి వుండదు' అని స్పష్టంచేశారు జక్కన్న.