యాప్నగరం

‘పైసా వసూల్’ ఆడియో వేడుకకు వర్షం అడ్డంకి!

నందమూరి బాలకృష్ణ నటించిన 101వ చిత్రం ‘పైసా వసూల్‌’ ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు (గురువారం) ఖమ్మంలోని సర్ధార్‌పటేల్‌ స్టేడియంలో కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది.

TNN 17 Aug 2017, 8:36 pm
నందమూరి బాలకృష్ణ నటించిన 101వ చిత్రం పైసా వసూల్‌ ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు (గురువారం) ఖమ్మంలోని సర్ధార్‌పటేల్‌ స్టేడియంలో కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే పైసా వసూల్ ఆడియో వేడుకకు వర్షం అడ్డింకిగా మారింది. కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే భారీ వర్షం పడటంతో ఆటంకంగా మారింది. అయితే కాసేపట్లో వర్షం తగ్గవచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు.
Samayam Telugu bala krishna paisa vasool audio event live updates
‘పైసా వసూల్’ ఆడియో వేడుకకు వర్షం అడ్డంకి!


ఇక ఈ ఆడియో కార్యక్రమంలో హీరో బాలకృష్ణ, హీరోయిన్ శ్రియ, దర్శకుడు పూరీ జగన్నాథ్, చార్మి, ఆలీ, వెనిగండ్ల ఆనంద్‌ప్రసాద్‌‌లో పాటు ఇతర నటులు వేదికపైకి చేరుకున్న కాసేపటికే భారీ వర్షం పడటంతో బాలయ్య అభిమానులు నిరాశ చెందారు. అయితే వారిలో ఉత్సాహం నింపేందుకు బాలయ్య స్టేజ్‌పైకి ఎక్కి అభిమానుల్లో జోష్ నింపారు. అయితే ఉదయం నుండి వేదిక వద్దకు బాలయ్య అభిమానులు భారీ స్థాయిలో చేరుకోవడంతో ఖమ్మం పట్టణం కోలాహలంగా మారింది. ఇక పైసా వసూల్ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించగా.. సెప్టెంబర్‌1 ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.