యాప్నగరం

తారక్‌తో ఆప్యాయంగా మాట్లాడిన బాలయ్య.. వీడియో వైరల్

నందమూరి కుటుంబంలో గతంలో ఏర్పడిన విబేధాలు సమసిపోయినట్టే అనిపిస్తోంది. అబ్బాయిని బాబాయి ఆప్యాయంగా పలకరించారు.

Samayam Telugu 1 Sep 2018, 9:45 am
హరికృష్ణ ఆకస్మిక మరణంతో నందమూరి ఫ్యామిలీ అంతా ఒక్కటైంది. ఇంతకు ముందు వరకు కాస్త ఎడమొహం పెడమొహంగా ఉన్న కుటుంబ సభ్యులంతా విషాద సమయంలో ఏకతాటి మీదకు వచ్చారు. కష్టకాలంలో ఒకరికి మరొకరు తోడుగా నిలుస్తున్నారు. హరికృష్ణను కడసారి సాగనంపే సమయంలో చంద్రబాబు పాడె మోసి బావమరిది మీద ప్రేమను చాటారు.
Samayam Telugu ntr-family


మరోవైపు బాలయ్య కూడా తన అన్న కొడుకులను ఆత్మీయంగా పలకరించి మేమంతా ఒక్కటే అనే సందేశం పంపారు. భోజనాలు చేస్తున్న కళ్యాణ్ రామ్, తారక్ దగ్గరకు వెళ్లిన బాలకృష్ణ వారిని ఆప్యాయంగా పలకరించారు. బాబాయి మాట్లాడుతుండగా.. అబ్బాయిలిద్దరూ శ్రద్ధగా విన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కష్ట సమయంలో కుటుంబీకులంతా ఏకతాటి మీదకు రావడం చూసి నందమూరి ఫ్యాన్స్ ఊరట చెందుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.