యాప్నగరం

ఆ లక్షణం ఏఎన్నార్ నుంచి నేర్చుకున్నా: బాలకృష్ణ

ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లు లాంటి వారని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు.

TNN 25 Dec 2017, 11:02 am
ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లు లాంటి వారని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ నుంచి క్రమశిక్షణ, సమయం విలువను తెలుసుకుంటే.. పొగడ్తలకు దూరంగా ఉండటం ఏఎన్నార్ నుంచి నేర్చుకున్నానని బాలకృష్ణ చెప్పారు.
Samayam Telugu balakrishna speech in jai simha audio release event
ఆ లక్షణం ఏఎన్నార్ నుంచి నేర్చుకున్నా: బాలకృష్ణ


ఆదివారం సాయంత్రం విజయవాడలో జరిగిన ‘జైసింహా’ ఆడియో విడుదల వేడుకలో బాలయ్య తన వాగ్ధాటితో అభిమానులను ఆకట్టుకున్నారు. ‘కనకదుర్గమ్మ ఉగ్గుపాలు తాగి.. కృష్ణవేణమ్మ ఉత్తుంగ తరంగాలలో ఉయ్యాలలూగి ఉర్రూతూలుగుతున్న ప్రాంతం మన కృష్ణాజిల్లా. మానవతారూపులైన ఎందరో మహానుభావులకు ఈ గడ్డ జన్మనిచ్చింది’ అంటూ ప్రారంభమైన బాలయ్య ప్రసంగం సుదీర్ఘంగా సాగింది.

‘జైసింహా’ చిత్రం ఆడియోను అమరావతిలో విడుదల చేయడం సంతోషంగా ఉందని బాలకృష్ణ అన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ తీసిన ‘జయ సింహా’ పెద్ద బ్లాక్ బస్టర్ అని.. ఇప్పుడు అదే పేరుతో తీసిన ‘జైసింహా’ కూడా మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కె.ఎస్‌.రవికుమార్‌కు తాను పెద్ద ఫ్యాన్‌ను అని, ఎనిమిదేళ్ల నుంచి ఆయనతో పనిచేయాలని చూస్తున్నానని చెప్పారు.

ఎన్టీఆర్‌ తర్వాత విభిన్న సినిమాలు చేసే అదృష్టం తనకు దక్కడం పూర్వ జన్మ సుకృతమన్నారు. తాను ఇప్పటి వరకు చాలా పాత్రలే చేశానని, వాటికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన అభిమానులు తనను పెంచి పోషించారన్నారు. జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలిపిన బాలయ్య.. చివరిగా క్రైస్తవ సోదరులందరకీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపి ప్రసంగాన్ని ముగించారు. ‘జైసింహా’ ఆడియోను ఏపీ మంత్రి, బాలయ్య అల్లుడు నారా లోకేశ్ ఆవిష్కరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.