యాప్నగరం

NTR Kathanayakudu: రెండు భాగాలుగా బయోపిక్, రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. సెకండ్ పార్ట్ పేరు?

ఎన్టీఆర్ బయోపిక్‌‌ను యన్.టి.ఆర్ కథానాయకుడు పేరిట సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు డైరెక్టర్ క్రిష్ ప్రకటించారు. టైటిల్‌ను బట్టి సినిమా రెండు భాగాలుగా ఉంటుందని అర్థమవుతోంది.

Samayam Telugu 4 Oct 2018, 12:20 pm
సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ ఘన విజయం సాధించింది. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ఊపుతో బయోపిక్‌ల హవా మొదలైంది. దివంగత నటుడు, తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ బయోపిక్‌ను డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నారు. వెండితెరపైనే కాకుండా తెలుగు ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.
Samayam Telugu ntr kathanayakudu


ఇప్పటి వరకూ ‘యన్‌.టి.ఆర్’ అని ఈ సినిమా పేరును ప్రచారం చేయగా.. దానికి కథానాయకుడు అనే క్యాప్షన్ జత చేశారు. టైటిల్‌ను ఎన్టీఆర్ కథానాయకుడిగా మార్చడాన్ని బట్టి రెండు భాగాలుగా ఈ సినిమా ఉంటుందని భావిస్తున్నారు. రెండో భాగానికి యన్.టి.ఆర్ ప్రజానాయకుడు అని టైటిట్ పెట్టినట్టు తెలుస్తోంది.
బాలయ్యబాబు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేయనున్నామని డైరెక్టర్ క్రిష్ తెలిపాడు. ‘ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు.. కానీ కథగా మారే నాయకుడొక్కడే వుంటాడు.. జనవరి 9న యన్.టి.ఆర్ కథనాయకుడు’ వస్తున్నాడని క్రిష్ ట్వీట్ చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.