యాప్నగరం

Bandla Ganesh: భార్యాబిడ్డలను ప్రేమించనోడు మనిషా.. పూరీని మళ్లీ గెలికిన బండ్ల గణేష్ ఫైర్

భార్యాబిడ్డలను ప్రేమించనోడు మనిషా..? అంటూ బండ్ల గణేష్ (Bandla Ganesh) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. నటుడు పోసాని కృష్ణమురళిపై కూడా సంచలన ఆరోపణలు చేశారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 30 Sep 2022, 4:52 pm
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)పై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) మళ్లీ గెలికారు. భార్యాబిడ్డలను ప్రేమించనోడు మనిషా..? అంటూ ఆయనను ఉద్దేశించి అన్నట్లు తెలుస్తోంది. ఐడ్రీమ్ నాగరాజుకు తాజాగా బండ్ల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేయగా.. బండ్ల గణేష్ ఆసక్తికర విషయాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. వ్యాపారాలు, వ్యాపకాలు వంద ఉన్నాయి.. వాటిని పక్కన రాజకీయాల్లోకి ఎందుకు వేలు పెడుతున్నారని అడగ్గా.. తానేక్కడ వేలు పెట్టానని బండ్ల అన్నారు.
Samayam Telugu Bandla Ganesh ON Puri Jagannadh
పూరీ జగన్నాథ్, బండ్ల గణేష్


అదేవిధంగా నటుడు పోసాని కృష్ణమురళిపై కూడా ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. పోసాని చావు మాములుగా ఉండదంటూ బండ్ల అన్నట్లు ప్రోమోను చూస్తే అర్థమవుతోంది. 'అన్న నువ్వు పెట్టే బోనులో పడే ఎలుకలు చాలా ఉంటాయి. కానీ బండ్ల గణేష్ పడడు. కేటీఆర్ గారు అంటే ఆన్సర్ ఇస్తా.. మెగా ఫ్యామిలీ అంటే ఆన్సర్ ఇస్తా.. పోసాని అంటే ఆన్సర్ ఇస్తా.. లింక్‌లు పెడితే చెప్పను..' అంటూ నాగరాజుతో వాడివేడిగా మాట్లాడారు.

తన మీద కోపం ఉంటే తనను కొట్టాలని.. తిట్టాలని.. అంతేగానీ మధ్యలో మా అమ్మానాన్న ఏం చేశారని ప్రశ్నించారు బండ్ల. గతంలో బండ్ల గణేష్‌ను ఉద్దేశించి ఇండైరెక్ట్‌గా పూరీ జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. భార్యను, బిడ్డలను ప్రేమించనోడు మనిషా అన్న అంటూ బండ్ల ఫైర్ అయ్యారు. పూరీకి మంచి చెడు చెప్పే హక్కు తనకు ఉందని.. అతను తన ఫ్రెండ్ అని అన్నారు.

మా ఎన్నికల సమయంలో కోటా శ్రీనివాసరావును నాగబాబు విమర్శించారు.. దీన్ని మీరు సమర్థిస్తారా..? వ్యతిరేకిస్తారా..? అని అడగ్గా.. తనను ఇరికించాలని చూడకు అన్న అంటూ బండ్ల సున్నితంగా చెప్పారు. లవ్ వన్‌సైడ్ ఉంటోందేమో గానీ.. వార్ వన్‌సైడ్ ఉండదన్నారు. ఇక్కడితో ప్రోమో కట్ చేశారు. ఈ ప్రోమో తెగ వైరల్ అవుతుండగా.. అందరూ ఫుల్ ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

పూరీ జగన్నాథ్ తనయుడి ఆకాశ్ పూరీ మూవీ చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు వైరల్ అయిన విషయం తెలిసిందే. 'ఎంతమందినో స్టార్లను చేశాడు.. సూపర్ స్టార్లను చేశాడు.. కానీ కన్న కొడుకు సినిమా ఫంక్షన్‌కి మాత్రం రాలేదు. భార్యాబిడ్డల రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. ఒక్కసారి తీసుకుంటే చచ్చేవరకూ వదిలిపెట్టకూడదు. ఆకాష్‌ని స్టార్‌ని చేయాల్సిందే.. వాడి డేట్స్ కోసం నువ్వు ఎదురుచూసే రోజు వస్తుంది..' బండ్ల నోటికి వచ్చినట్లు మాట్లాడేశారు.

ఈ వ్యాఖ్యలకు పూరీ జగన్నాథ్ కూడా ఇండైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చారు. 'గుర్తు పెట్టుకోండి.. మన నాలుకు కదులుతున్నంత సేపు మనం ఏమీ నేర్చుకోలేం.. అందుకే జీవితంలో ఎక్కువ సేపు మనం వింటూ ఉండాలి.. అదే మంచిది.. ఫ్యామిలీ మెంబర్స్ కావొచ్చు.. మీ ఫ్రెండ్స్ కావొచ్చు.. ఆఫీస్ మెంబర్స్ కావొచ్చు.. ఆకరికి కట్టుకున్న భార్య దగ్గర కూడా ఆచితూచి మాట్లాడండి.. చీప్‌గా వాగొద్దు.. చీప్‌గా ప్రవర్తించొద్దు.. మన వాగుడు మన కెరీర్‌ను, క్రెడిబులిటీని డిసైడ్ చేస్తది.. మీరు వినే ఉంటారు సుమతీ శతకం.. నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ.. తప్పు మాట్లాడటం కంటే నాలుక కొరికేసుకోవడం చాలా మంచిది..చివరగా ఒక మాట.. నీ లైఫ్, నీ డెత్.. నీ టంగ్ మీద ఆధారపడి ఉంటుంది..' అంటూ పూరీకి సంబంధించిన ఆడియో క్లిప్ నెట్టింట హల్‌చల్ చేసింది. ఈ నేపథ్యంలో ఐడ్రీమ్ నాగరాజుతో బండ్ల గణేష్ ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.