యాప్నగరం

‘రంగస్థలం విజయోత్సవం’: చిట్టిబాబుపై రామలక్ష్మి ఫిర్యాదు!

హైదరాబాద్‌లో అంగరంగవైభవంగా జరుగుతున్న ‘రంగస్థలం విజయోత్సవ వేడుక’కు రామలక్ష్మి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చేసింది.

Samayam Telugu 13 Apr 2018, 8:36 pm
హైదరాబాద్‌లో అంగరంగవైభవంగా జరుగుతున్న ‘రంగస్థలం విజయోత్సవ వేడుక’కు రామలక్ష్మి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చేసింది. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో శుక్రవారం సాయంత్రం (ఏప్రిల్ 13) ప్రారంభమైన ఈమెగా ఈవెంట్‌లో రామలక్ష్మి కర్లింగ్ హెయిర్‌తో సూపర్బ్ లుక్‌తో ప్రేక్షకుల్ని మైమరపించింది. యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో రామలక్ష్మిని ఆహ్వానిస్తూ.. చిట్టిబాబు ఎక్కడున్నాడు సమంతా అంటే వచ్చేస్తున్నాడు అన్నట్టుగా చిరునవ్వులు చిందిస్తూ సైగలు చేసిన సమంత. ఇంతకీ చిట్టిబాబు గాజులు కొనిచ్చాడా అంటూ లేదు అంటూ తెగ సిగ్గుపడిపోతూ సుమకు ఫిర్యాదు చేసింది అందాల రామలక్ష్మి.
Samayam Telugu సమంత

ఇక ఈ మెగా ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరౌతుండగా.. మెగాస్టార్ చిరంజీవి మెగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ‘రంగస్థలం’ మూవీకి పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ.. జగపతిబాబు, ఆది, చంద్రబోస్, రత్నవేలు, చంద్రబోస్, సుకుమార్, నరేష్, అనసూయ తదితరులు హాజరయ్యారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తేజ్, సమంత జోడీగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ మూవీ మార్చి 30 ప్రపంచ వ్యాప్తంగా విడుదలై నాన్ బాహుబలి రికార్డ్స్‌ను తుడిచిపెట్టేసింది. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఈ చిత్రం. కాగా ఈమూవీలో చిట్టిబాబు‌గా రామ్ చరణ్ నటనకు సినీ ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.