యాప్నగరం

బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఛాలెంజ్ విసిరిన సామ్రాట్

నటుడు సామ్రాట్ ‘బిగ్ బాస్’ సీజన్‌ 2లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో తనతో పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వాళ్లందరికీ ఆయన ఒక ఛాలెంజ్ విసిరారు.

Samayam Telugu 12 Jul 2020, 11:29 pm
నటి కీర్తి రెడ్డి సోదరుడు సామ్రాట్ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈయన ‘బిగ్ బాస్’ షోలో పాల్గొనడం ద్వారా మరింత పాపులర్ అయ్యారు. నాని హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో సామ్రాట్ పాల్గొన్నారు. కౌశల్ మండ విజేతగా నిలిచిన ఈ సీజన్‌లో గీతా మాధురి, తనీష్, టీవీ9 దీప్తి, రోల్ రైడా, అమిత్, యాంకర్ శ్యామల, తేజస్వి, భాను, నందిని రాయ్ తదితరులు కంటెస్టెంట్లుగా ఉన్నారు. అయితే, తన బిగ్ బాస్ ఫ్యామిలీకి సామ్రాట్ ఇప్పుడు ఒక ఛాలెంజ్ విసిరారు. అది గ్రీన్ ఇండియా ఛాలెంజ్.
Samayam Telugu సామ్రాట్
Samrat Reddy


Also Read: సాయి పల్లవి ఆ పాత్ర చేయడం లేదు.. డైరెక్టర్ వివరణ

తన సోదరి శిల్పా రెడ్డి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సామ్రాట్.. ఆదివారం రెండు మొక్కలను నాటారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశారు. అయితే, ఈ ఛాలెంజ్‌కు ఆయన ఒకరిద్దరిని కాకుండా తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు అందరినీ నామినేట్ చేశారు. అలాగే, తనతో పాటు బిగ్ బాస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లను నామినేట్ చేశారు. వాళ్లంతా కూడా మరికొంత మందిని నామినేట్ చేసి మొక్కలు నాటించాలని కోరారు.
View this post on Instagram I am super excited to have been nominated for #greenindiachallenge #harahaitohbharahai challange. Now I challenge my insta family to take up this challange and nominate many others, but remember to keep them alive and help them survive. Only then this challange makes sense. I also nominate all my Big boss family to do the same. Remember this is a basic responsibility to make our planet green. #everytreecounts @rollrida @amitkumar_tiwari @tanishalladi A post shared by Actor Samrat (@samratreddy) on Jul 12, 2020 at 7:12am PDT
తాను మొక్కలు నాటిన సందర్భంగా సామ్రాట్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన హరితహారం కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా విజయవంతమైంది. హరితహారం స్ఫూర్తితో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే మనం నీరు కొనుక్కుంటున్నాం.. భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి రాకూడదు.

భవిష్యత్ తరాలకు మనం ఇచ్చేది ఒకటే మంచి వాతావరణాన్ని అందించడం. కాబట్టి మనందరం మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. నేను కూడా ప్రతిరోజు ఆఫీసుకి వెళ్ళే సమయంలో తప్పకుండా నేను నాటిన మొక్కను రక్షించే బాధ్యత తీసుకుంటాను. ఎన్ని కష్టాలు వచ్చినా, కరోనా సమయంలో కూడా చెట్లు నాటే కార్యక్రమం ఆగకూడదు’’ అని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.