యాప్నగరం

సౌందర్య బయోపిక్ కూడా వస్తుందట!

సావిత్రి బయోపిక్ ‘మహానటి’దాని రూపకర్తలకు లాభాలు పండిస్తుండే సరికి టాలీవుడ్‌లో ఈ తరహా ప్రయత్నాలు ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Samayam Telugu 17 May 2018, 2:43 pm
సావిత్రి బయోపిక్ ‘మహానటి’దాని రూపకర్తలకు లాభాలు పండిస్తుండే సరికి టాలీవుడ్‌లో ఈ తరహా ప్రయత్నాలు ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని బయోపిక్స్ లాంఛనంగా మొదలయ్యాయి. ఎన్టీఆర్, వైఎస్సార్ బయోపిక్‌లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఆ సంగతలా ఉంటే మహానటి విడుదల తర్వాత మరికొన్ని బయోపిక్స్ వార్తలు వస్తున్నాయి. ఇవి అసలు ప్రారంభం అవుతాయో? నిజంగానే రూపొందుతాయో, లేక గాలి కబుర్లుగానే మిగిలిపోతాయో తెలియదు కానీ.. ఆసక్తిదాయకమైన వార్తలు అయితే వస్తున్నాయి.
Samayam Telugu soundarya


ఇప్పుడు రెండో బయోపిక్స్ వార్తల్లోకి వచ్చాయి. వాటిలో ఒకటి ఆత్మహత్య చేసుకుని మరణించిన నటుడు ఉదయ్ కిరణ్ బయోపిక్ కాగా రెండోది హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన నటి సౌందర్య బయోపిక్. వీటిని రూపొందిస్తామని టాలీవుడ్ వాళ్లు అంటున్నారు.

ఉదయ్ కిరణ్ బయోపిక్ ప్రతిపాదన చేసింది దర్శకుడు తేజ. ఇక సౌందర్య బయోపిక్ ప్రతిపాదన చేసింది నిర్మాత రాజ్ కందుకూరి. 2004 ఎన్నికల సమయంలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లి సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. దాదాపు వంద సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన సౌందర్య తెలుగు వాళ్ల నుంచి అమితమైన ఆదరణను పొందిన హీరోయిన్. ఆమె బయోపిక్ తీస్తే ఆసక్తిదాయకమే. అయితే.. ఇవన్నీ ప్రతిపాదనలుగానే మిగులుతాయా? లేక పట్టాలెక్కుతాయో వేచి చూడాలి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.