యాప్నగరం

ధనుష్ కేసులో ట్విస్ట్: పుట్టుమచ్చా చెరిగీపోదులే..

తమిళ యంగ్ హీరో, రజనీ కాంత్ అల్లుడు ధనుష్ తమ కుమారుడే అంటూ కదిరేశన్, మీనాక్షి దంపతులు మధురై కోర్టు కెక్కిన కేసు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో సాగుతుంది.

TNN 20 Mar 2017, 8:32 pm
తమిళ యంగ్ హీరో, రజనీ కాంత్ అల్లుడు ధనుష్ తమ కుమారుడే అంటూ కదిరేశన్, మీనాక్షి దంపతులు మధురై కోర్టు కెక్కిన కేసు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో సాగుతుంది. హీరో ధనుష్‌ చెన్నైలోని పాఠశాలలో చదువుకున్న ఆధారాలను, ఆయన పదవ తరగతి పరీక్షలు రాసిన పత్రాలతో పాటు టీసీలో పుట్టుమచ్చల వివరాలను కూడా కోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే..
Samayam Telugu birth marks removed from dhanush body medical reports says
ధనుష్ కేసులో ట్విస్ట్: పుట్టుమచ్చా చెరిగీపోదులే..


కాగా ఇప్పటికే.. ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగింది. ధనుష్‌ తరపు న్యాయవాది కధిరేశన్‌ దంపతుల ఆరోపణల్లో నిజం లేదనీ, అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కదిరేశన్‌ దంపతులు కోర్టుకు విన్నవించుకున్న నేపథ్యంలో ధనుష్‌ తరపున కొన్ని ఆధారాలను ఇరు వర్గాలు కోర్టుకు సమర్పించారు.

కధిరేశన్ దంపతులు కోర్టులో ప్రవేశపెట్టిన టీసీలో పుట్టు మచ్చలు పేర్కొన్నట్లు ఉండగా, ధనుష్ తరఫు లాయర్ సమర్పించిన టీసీలో పుట్టు మచ్చల ప్రస్తావన లేదు. దీంతో ధనుష్ కోర్టుకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు అందజేసింది. దీంతో ధనుష్ తన తల్లిదండ్రులుగా పేర్కొంటున్న విజయలక్ష్మి, కస్తూరి రాజాతో కలిసి ఫిబ్రవరి 28న కోర్టుకు హాజరయ్యారు. మధురై గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు ధనుష్ పుట్టుమచ్చలను పరిశీలించారు.

ధనుష్ పుట్టుమచ్చలపై డాక్టర్లు కోర్టుకు సమర్పించిన నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ధనుష్ శరీరంపై ఉన్న పుట్టుమచ్చలను లేజర్ ట్రీట్ మెంట్ ద్వారా తొలగించుకున్నాడని హాస్పిటల్ డీన్ తన నివేదికను కోర్టుకు తెలియజేశారు. దీంతో కేసును పరిశీలించిన మధురై కోర్టు కేసును మార్చి 27 కు వాయిదా వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.