యాప్నగరం

'పద్మావతి' నిర్మాతలకి బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్!

హైదరాబాద్‌ గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ నేత రాజా సింగ్ లోథా పద్మావతి చిత్ర...

TNN 6 Nov 2017, 10:00 pm
హైదరాబాద్‌ గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ నేత రాజా సింగ్ లోథా పద్మావతి చిత్ర నిర్మాతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పద్మావతి సినిమా హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా చిత్రీకరించారని తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన రాజా సింగ్.. ఆ సినిమాను విడుదలకన్నా ముందుగా రాజ్‌పుత్‌లకు చూపించి వారి అనుమతి తీసుకోవాలని అని అన్నారు. లేదంటే ఆ సినిమాను ప్రదర్శించే థియేటర్లను తగులబెడుతామని ఆయన హెచ్చరించారు. సికింద్రాబాద్‌లోని రాజ్‌పుత్ కమ్యూనిటీతో మాట్లాడిన సందర్భంగా ఎమ్మెల్యే రాజా సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆ వీడియోను తన ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేశారు.
Samayam Telugu bjp mla raja singh warns padmavati film producers
'పద్మావతి' నిర్మాతలకి బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్!


సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాణి పద్మిణితో అల్లా ఉద్దీన్ ఖిల్జీ ప్రేమాయణం సాగించినట్లుగా చూపించినట్టు తెలుస్తోంది. కానీ వాస్తవానికి చరిత్రలో అలా జ‌రగ‌లేదు. అల్లా ఉద్దీన్ ఖిల్జీ చిత్తోర్‌గఢ్‌పై దాడి చేసిన అనంతరం 16 వేల మంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారని రాజ్‌పుత్ కమ్యూనిటీ ప్రజలకి చరిత్రను గుర్తుచేశారు రాజా సింగ్ లోథా. అందుకే హిందు ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఈ సినిమా విడుదలని అడ్డుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే రాజా సింగ్.... ఈ పోరాటంలో పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్లని బయటకు తీసుకొచ్చే బాధ్యత తనదేనని వారికి హామీ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.