యాప్నగరం

SSMB 28 : Mahesh babu కోసం బాలీవుడ్‌ బోల్డ్ బ్యూటీ.. ఇంతకీ త్రివిక్రమ్ ఏం చేస్తున్నాడో?

SSMB 28 - Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న SSMB 28లో ఇప్ప‌టికే పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. వీరిద్ద‌రూ కాకుండా మ‌రో బాలీవుడ్ హీరోయిన్‌ను కూడా తీసుకున్నార‌ని టాక్ వినిపిస్తోంది

Authored byతుమ్మల మోహన్ | Samayam Telugu 21 Feb 2023, 5:52 pm
SSMB 28: మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబోకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసిన ప్రతీసారి మ్యాజిక్ జరుగుతూనే ఉంటుంది. అయితే వెండితెరపై వీరి కాంబోకు అంత క్రేజ్ ఉండకపోయినా బుల్లితెరపై మాత్రం ఎవర్‌గ్రీన్‌ కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోతాయి. అతడు సినిమా బాక్సాఫీస్ వద్ద లాభాలను తీసుకురాలేకపోయినా.. బుల్లితెరపై ఇప్పటికీ ఎప్పటికీ బోర్ కొట్టని సినిమాగా ఉంటుంది. ఖలేజా సినిమా సైతం బుల్లితెరపై ఫేవర్‌ట్‌ సినిమాగా అభిమానులకు ఎప్పటికీ ఉంటుంది.
Samayam Telugu Mahesh babu
Mahesh babu, మహేష్ బాబు


ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు మహేష్‌ బాబు త్రివిక్రమ్ రెడీ అయ్యారు. ఈ మూవీ ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూనే ఉంది. ముందు అనుకున్న కథ అంతా మారిపోయింది. మహేష్ బాబు కోరిక మేరకు ఇంకో కొత్తను త్రివిక్రమ్ రెడీ చేశాడు. అంతకు ముందు తీసిన ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కొత్త కథలో భాగం చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ ఫైట్ ఈ కొత్త కథకు సెట్ కాలేదట. దాంతో ఆ యాక్షన్ సీక్వెన్స్‌ను పక్కన పెట్టేశారట.

ఇప్పుడు త్రివిక్రమ్ ఈ సినిమా కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడట. శ్రీలీల, పూజా హెగ్డేలను హీరోయిన్లుగా తీసుకున్నాడు త్రివిక్రమ్. ఇక మాటల మాంత్రికుడి సినిమా అంటే.. ఎవరో ఒక సీనియర్ హీరోయిన్, బాలీవుడ్ సీనియర్ నటి ఉండాల్సిందే. ఇప్పుడు ఈ సినిమా కోసం మరో బాలీవుడ్ బ్యూటీని పట్టేసినట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ భూమి పెడ్నెకర్‌ను త్రివిక్రమ్ తీసుకోవాలని చూస్తున్నాడట. మరి ఆమె పాత్ర ఎలా ఉంటుంది? మహేష్‌ బాబుతో ఎలాంటి సీన్స్ ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. ఈ ఏడాది ఆగస్ట్‌లోనే ఈ సినిమాను రిలీజ్ చేయబోతోన్న విషయం తెలిసిందే.

Bhumi Pednekar, భూమి పెడ్నేకర్


అతడు, ఖలేజా తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనేది త్రివిక్రమ్ ఆలోచన. సినిమాను ఈ ఏడాదిలోనే ఆగస్ట్ 11న రిలీజ్ చేయాలనేది ప్రస్తుతం నిర్మాతల ఆలోచనగా కనిపిస్తుంది.

ALSO READ: Samantha: మైన‌స్ 8 డిగ్రీలు చలిలో ఇష్ట‌మైన వ్య‌క్తితో స‌మంత‌
ALSO READ: Chiranjeevi: ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్‌గా మెగాస్టార్.. పవన్ కళ్యాణ్ సాంగ్ రీమిక్స్‌లో చిరు స్టెప్పులు
రచయిత గురించి
తుమ్మల మోహన్
మోహ‌న్ కుమార్ తుమ్మ‌ల స‌మ‌యం తెలుగులో డిజిట‌ల్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఇక్కడ సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్, వార్తలను రాస్తుంటారు. మోహ‌న్ కుమార్‌కి సినీ జ‌ర్న‌లిజంలో 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. గ‌తంలో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల్లో సినీ జ‌ర్న‌లిస్టుగా వ‌ర్క్ చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.