యాప్నగరం

సామాజిక అంశాలపై స్పందించిన బాలీవుడ్ సెలబ్రిటీలు

ప్రధానిగా నరేంద్ర మోడీ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో బాలీవుడ్ సెలబ్రిటీలు..

TNN 30 May 2016, 12:07 pm
ప్రధానిగా నరేంద్ర మోడీ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో బాలీవుడ్ సెలబ్రిటీలు సందడిచేశారు. 'బేటీ బచావో బేటీ పడావో' క్యాంపెయిన్‌కి బ్రాండ్ అంబాసడర్‌గా వున్న మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మరుగుదొడ్డి నిర్మాణం ఆవశ్యకతని తెలియజెప్పే 'జహా సోచ్.. వహా శౌచాలయ్' క్యాంపెయిన్‌కి బ్రాండ్ అంబాసడర్‌గా వున్న విద్యాబాలన్, స్వచ్ఛ్ భారత్‌కి ఇరాదా సాంగ్ పాడిన ఖైలాష్ ఖేర్, ప్రముఖ రచయిత ప్రసూన్ జోషి, సామాజిక అంశాలపై జనానికి అవగాహన కలిగిస్తున్న రవీనా టాండన్, ప్రసార భారతి కొత్త సభ్యురాలు కాజోల్ వంటివాళ్లు ఈ ఈవెంట్ ద్వారా సామాజిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమవంతు ప్రయత్నం చేశారు.
Samayam Telugu bollywood spreads awareness on social issues at pm modis 2 years event
సామాజిక అంశాలపై స్పందించిన బాలీవుడ్ సెలబ్రిటీలు


తమతమ సామాజిక సేవలని గుర్తుచేసుకుంటూ వారి అనుభవాలని, అభిప్రాయాలని వేదికపై పంచుకున్నారు.

బాలీవుడ్ సెలబ్రిటీలు చేసిన సుదీర్ఘ ప్రసంగాల్లో సామాజికంగా దేశం సాధిస్తున్న ప్రగతి, పరిష్కారం అవుతున్న సమస్యలు, ఇంకా సాధించాల్సి వున్న లక్ష్యాలు వంటివి చర్చకొచ్చాయి.

అంతర్జాతీయంగా ఫేమస్ అయిన 'జై హో సాంగ్'తోపాటు మరిన్ని ఇతర పర్‌ఫార్మెన్స్‌లతో ఈ సెలబ్రేషన్స్‌ని హుషారెత్తించారు ఏ.ఆర్. రెహ్మాన్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.