అశేష అభిమానులను శోక సంద్రంలోకి నెట్టి అతిలోక సుందరి అనంతలోకాలకు తరలిపోయిన విషయం తెలిసిందే. ఐదు దశాబ్దాలపాటు దక్షిణాది నుంచి బాలీవుడ్ దాకా మకుటంలేని మహారాణిగా వెలిగిపోయిన అందాల తార శ్రీదేవి హఠాన్మరణం యావత్తు సినీ అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహం కోసం కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఫిబ్రవరి 24 న ఓ హోటల్లో ప్రమాదవశాత్తు బాత్టబ్లో పడి కన్నుమూశారు. అయితే శ్రీదేవి అకాల మరణంపై చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. తొలుత ఆమె గుండెపోటుతో చనిపోయారని కుటుంబంసభ్యులు ప్రకటించినా, ప్రమాదవశాత్తు బాత్టబ్లో పడి మృతిచెందినట్టు దుబాయ్ వైద్యులు తమ పోస్ట్మార్టమ్ నివేదికలో పేర్కొన్నారు. ఇంతకీ ఆమె మరణించిన రోజు రాత్రి ఏం జరిగిందనే విషయాన్ని శ్రీదేవి భర్త బోనీ కపూర్ తన స్నేహితుడు, సినీ విశ్లేషకుడు కోమల్ నహతాకు వివరించారట. దీని గురించి ఆయన తన బ్లాగులో రాశారు.
‘దుబాయ్లో ఫిబ్రవరి 20 న మోహిత్ మార్వా పెళ్లికి ప్లాన్ చేసుకుని వెళ్లలేదు. అయితే మోహిత్ వివాహం తర్వాత కొద్ది రోజులు అక్కడే ఉండి, జాన్వికి షాపింగ్ చేస్తానని శ్రీదేవి చెప్పారు. దీంతో నాకు లక్నోలో పని ఉండంటంతో ఫిబ్రవరి 22 న ఇండియా వచ్చేశానని, ఫిబ్రవరి 24 ఉదయం శ్రీదేవి తనకు ఫోన్ చేసి చాలా మిస్సవుతున్నానని చెప్పింది... అదే రోజు సాయంత్రం తాను దుబాయ్కు వస్తున్న విషయం శ్రీదేవికి చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. శ్రీదేవికి ఒంటరిగా ఉండే అలవాటు లేదు... అందుకే ‘తొందరగా దుబాయ్కి బయలుదేరండి డానీ అంటూ జాన్వి తనతో చెప్పింది... తాను లేకుండా ఒంటిరిగా శ్రీదేవి రెండుసార్లు మాత్రమే విదేశాలకు వెళ్లారని, ఒకసారి న్యూజెర్సీ, రెండోది వాంకోవర్ అంటూ’ బోనీ గుర్తుచేసుకున్నట్టు నహత తన బ్లాగులో రాశారు.
‘ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3.30 గంటలకు విమానంలో దుబాయ్ బయలుదేరి, సాయంత్రం 6.20 గంటలకు అక్కడకు చేరుకున్నాను... అయితే సర్ప్రైజ్ ఇద్దామనే ఉద్దేశంతోనే నా లగేజీని కాస్త ఆలస్యంగా ఆమె గదిలో పెట్టమని బెల్బాయ్కి చెప్పాను. నా వద్ద ఉన్న డూప్లికేట్ తాళం చెవితో గది తలుపు తెరిచాను. నన్ను చూసి సంతోషంతో ఆలింగనం చేసుకున్న ఆమె, నేను దుబాయ్కి వచ్చి సర్ప్రైజ్ చేస్తానని ముందే ఊహించానని చెప్పింది. అరగంట పాటు ఇద్దరం కూర్చుని మాట్లాడుకున్నాం... ఆ తర్వాత ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్లాలనుకున్నాం. దీంతో శ్రీదేవి స్నానం చేసి వస్తానంది’ అని బోనీ అన్నట్టు బ్లాగులో తెలిపారు.
తను రెడీ అయి వచ్చేంత వరకు లివింగ్ రూంలో ఉంటానని చెప్పాను. తను వస్తుందని 15 నుంచి 20 నిమిషాలు టీవీ చూస్తూ కూర్చున్నాను. కానీ ఎంతసేపటికీ గదిలో నుంచి బయటికి రాలేదు. శనివారం కాబట్టి రెస్టారెంట్స్లో రద్దీ ఎక్కువ ఉంటుందని శ్రీదేవికి తెలుసు.. రాత్రి 8 గంటలు కావస్తున్నా ఇంకా రాలేదు.. దీంతో ఏం జరిగిందోనని కంగారుపడి గదిలోకి వెళ్లాను. తను ఇంకా వాష్రూమ్ నుంచి బయటకు రాలేదు. చాలాసార్లు తలుపు కొట్టి చూశాను.. జాన్, జాన్ అని పిలిచినా లోపలి నుంచి ఎలాంటి స్పందన లేదు.. బాత్రూమ్ తలుపు గడియ పెట్టలేదు. దీంతో లోపలికి వెళ్లాను. అందులోకి వేళ్లేసరికి నిండుగా నీటితో ఉన్న బాత్టబ్లో మునిగిపోయి ఉంది. అది చూసి ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది’ అని బోనీ నహతాకు వివరించారట.
‘దుబాయ్లో ఫిబ్రవరి 20 న మోహిత్ మార్వా పెళ్లికి ప్లాన్ చేసుకుని వెళ్లలేదు. అయితే మోహిత్ వివాహం తర్వాత కొద్ది రోజులు అక్కడే ఉండి, జాన్వికి షాపింగ్ చేస్తానని శ్రీదేవి చెప్పారు. దీంతో నాకు లక్నోలో పని ఉండంటంతో ఫిబ్రవరి 22 న ఇండియా వచ్చేశానని, ఫిబ్రవరి 24 ఉదయం శ్రీదేవి తనకు ఫోన్ చేసి చాలా మిస్సవుతున్నానని చెప్పింది... అదే రోజు సాయంత్రం తాను దుబాయ్కు వస్తున్న విషయం శ్రీదేవికి చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. శ్రీదేవికి ఒంటరిగా ఉండే అలవాటు లేదు... అందుకే ‘తొందరగా దుబాయ్కి బయలుదేరండి డానీ అంటూ జాన్వి తనతో చెప్పింది... తాను లేకుండా ఒంటిరిగా శ్రీదేవి రెండుసార్లు మాత్రమే విదేశాలకు వెళ్లారని, ఒకసారి న్యూజెర్సీ, రెండోది వాంకోవర్ అంటూ’ బోనీ గుర్తుచేసుకున్నట్టు నహత తన బ్లాగులో రాశారు.
‘ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3.30 గంటలకు విమానంలో దుబాయ్ బయలుదేరి, సాయంత్రం 6.20 గంటలకు అక్కడకు చేరుకున్నాను... అయితే సర్ప్రైజ్ ఇద్దామనే ఉద్దేశంతోనే నా లగేజీని కాస్త ఆలస్యంగా ఆమె గదిలో పెట్టమని బెల్బాయ్కి చెప్పాను. నా వద్ద ఉన్న డూప్లికేట్ తాళం చెవితో గది తలుపు తెరిచాను. నన్ను చూసి సంతోషంతో ఆలింగనం చేసుకున్న ఆమె, నేను దుబాయ్కి వచ్చి సర్ప్రైజ్ చేస్తానని ముందే ఊహించానని చెప్పింది. అరగంట పాటు ఇద్దరం కూర్చుని మాట్లాడుకున్నాం... ఆ తర్వాత ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్లాలనుకున్నాం. దీంతో శ్రీదేవి స్నానం చేసి వస్తానంది’ అని బోనీ అన్నట్టు బ్లాగులో తెలిపారు.
తను రెడీ అయి వచ్చేంత వరకు లివింగ్ రూంలో ఉంటానని చెప్పాను. తను వస్తుందని 15 నుంచి 20 నిమిషాలు టీవీ చూస్తూ కూర్చున్నాను. కానీ ఎంతసేపటికీ గదిలో నుంచి బయటికి రాలేదు. శనివారం కాబట్టి రెస్టారెంట్స్లో రద్దీ ఎక్కువ ఉంటుందని శ్రీదేవికి తెలుసు.. రాత్రి 8 గంటలు కావస్తున్నా ఇంకా రాలేదు.. దీంతో ఏం జరిగిందోనని కంగారుపడి గదిలోకి వెళ్లాను. తను ఇంకా వాష్రూమ్ నుంచి బయటకు రాలేదు. చాలాసార్లు తలుపు కొట్టి చూశాను.. జాన్, జాన్ అని పిలిచినా లోపలి నుంచి ఎలాంటి స్పందన లేదు.. బాత్రూమ్ తలుపు గడియ పెట్టలేదు. దీంతో లోపలికి వెళ్లాను. అందులోకి వేళ్లేసరికి నిండుగా నీటితో ఉన్న బాత్టబ్లో మునిగిపోయి ఉంది. అది చూసి ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది’ అని బోనీ నహతాకు వివరించారట.