బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘జయ జానకీ నాయక’ సినిమా నైజాం రైట్స్ రికార్డు స్థాయి ధరకు అమ్ముడయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏకంగా తొమ్మిది కోట్ల రూపాయలను వెచ్చించి ఈ సినిమా థియేటరికల్ రైట్స్ ను కొనుక్కొన్నారట డిస్ట్రిబ్యూటర్లు. మరి ఇది భారీ మొత్తమే అని వేరే చెప్పనక్కర్లేదు. అందులోనూ సాయి శ్రీనివాస్ సినిమాపై ఇది భారీ మొత్తమే.
ఈ హీరోకి ఇది మూడో సినిమా మాత్రమే. మొదటి సినిమా ఫర్వాలేదనిపించింది, రెండో సినిమా ఆకట్టుకోలేకపోయింది. ముచ్చటగా మూడో సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నాడు ఈ హీరో. మరి థియేటరికల్ రైట్స్ ఈ రేంజ్ ధర పలకడం వెనుక ఉన్నది బోయపాటి ప్రభావమే అని స్పష్టం అవుతోంది.
దర్శకుడిగా బోయపాటి వరస హిట్ల మీదే ఉన్నాడు. ఈ దర్శకుడి చివరి సినిమా ‘సరైనోడు’ భారీ కలెక్షన్లను సంపాదించుకుంది. దీంతో ఆయన పేరు మీద ‘జయ జానకీ నాయక’ సినిమా భారీ బిజినెస్ చేస్తోందని అర్థం అవుతోంది.
ఈ హీరోకి ఇది మూడో సినిమా మాత్రమే. మొదటి సినిమా ఫర్వాలేదనిపించింది, రెండో సినిమా ఆకట్టుకోలేకపోయింది. ముచ్చటగా మూడో సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నాడు ఈ హీరో. మరి థియేటరికల్ రైట్స్ ఈ రేంజ్ ధర పలకడం వెనుక ఉన్నది బోయపాటి ప్రభావమే అని స్పష్టం అవుతోంది.
దర్శకుడిగా బోయపాటి వరస హిట్ల మీదే ఉన్నాడు. ఈ దర్శకుడి చివరి సినిమా ‘సరైనోడు’ భారీ కలెక్షన్లను సంపాదించుకుంది. దీంతో ఆయన పేరు మీద ‘జయ జానకీ నాయక’ సినిమా భారీ బిజినెస్ చేస్తోందని అర్థం అవుతోంది.