యాప్నగరం

జనసేనానితో సంపూర్ణేష్ బాబు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన పొలిటికల్ యాత్ర రెండో రోజుకు చేరుకుంది.

TNN 23 Jan 2018, 5:33 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన పొలిటికల్ యాత్ర రెండో రోజుకు చేరుకుంది. తొలిరోజు హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి బయలుదేరి వెళ్లిన పవన్ కళ్యాణ్.. రెండోరోజు కరీంనగర్ శుభం గార్డెన్స్‌లో జనసేన కార్యకర్తలతో సమావేశమై ప్రసంగించారు. అనంతరం జనసేన కార్యకర్తలతో ఫోటోలను దిగి వారిని ఉత్సాహపరిచారు.
Samayam Telugu burning star meets power star during political tour in telangana
జనసేనానితో సంపూర్ణేష్ బాబు


ఈ సందర్భంగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆయనతో ఫోటో దిగారు ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘ఫైనల్‌గా లీడర్‌ని కలిశాను.. మీ మాటలు స్ఫూర్తిదాయకం. మీ బాటలోనే మేము.. జై హింద్’ అంటూ సంపూర్ణేష్ బాబు ట్వీట్ చేస్తూ జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

కాగా ఇప్పటికే పవన్ చేపట్టిన యాత్రకు సెలబ్రిటీలు ట్విట్టర్ ద్వారా తమ మద్దతును తెలుపుతున్నారు. రామ్ చరణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌, వరుణ్ తేజ్‌లు ‘జై జనసేన’ అంటూ పవన్ యాత్రకు మద్దతు తెలిపారు. తాజాగా సంపూర్ణేష్ బాబు తన మద్దతును తెలిపారు.

Finally, Met the Leader...మీ మాటలు స్ఫూర్తిదాయకం. మీ బాటలోనే మేము.. జై హింద్ pic.twitter.com/zXmmVvJ5Cm — Sampoornesh Babu (@sampoornesh) January 23, 2018

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.