నందమూరి నట వారసుడు బాలకృష్ణ క్యారెక్టర్ గురించి ఎన్నో వార్తలు వింటుంటాం. బయటకు ఎలా కనిపించినా ఆయన మనసు వెన్న అని చాలామంది సినీ ప్రముఖులు చెప్పడం కూడా చూసాం. సీనియర్ హీరోగా నేటికీ సత్తా చాటుతూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్న బాలయ్య బాబు.. తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకొని వార్తల్లో నిలిచారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ఆయన.. ఓ చిన్నారి ప్రాణం కోసం చేసిన పని పలువురి ప్రశంసలందుకుంటోంది.
మణి శ్రీ అనే ఓ చిన్నారి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బాలయ్య ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఆసుపత్రికి రాగా.. ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం దాదాపు 7 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్స్ చెప్పారట. అయితే నిరుపేదలైన ఆ చిన్నారి తల్లిదండ్రులు దాతల సాయంతో ఒక లక్షా 80 వేల వరకు డబ్బు సమకూర్చుకొని మిగతా డబ్బు సర్ధుబాటు చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయారట.
అయితే ఓ వ్యక్తి సలహాతో బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ని కలిసి పరిస్థితి వివరించడంతో బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్.. ఆ చిన్నారి వ్యాధి, తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితిని దృష్టికి తీసుకువెళ్ళగా వెంటనే బాలకృష్ణ స్పందించి పాప ఆపరేషన్కు కట్టవలసిన 5 లక్షల 20 వేల రూపాయలు మాఫీ చేయించారు. అంతేకాదు ఆ చిన్నారికి మెరుగైన చికిత్స అందించమని వైద్య సిబ్బందికి ఫోన్ చేసి చెప్పారు. ఈ విషయం తెలిసి బాలయ్య మనసు వెన్న అంటూ మురిసిపోతున్నారు ఆయన ఫ్యాన్స్.
బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అఖండ' సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్డేట్స్ నందమూరి అభిమానులకు ఊపు తెప్పించాయి. ఈ సినిమాతో పాటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో మాస్ ఎంటర్టైనర్ చేసేందుకు రెడీ అయ్యారు బాలయ్య బాబు.
మణి శ్రీ అనే ఓ చిన్నారి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బాలయ్య ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఆసుపత్రికి రాగా.. ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం దాదాపు 7 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్స్ చెప్పారట. అయితే నిరుపేదలైన ఆ చిన్నారి తల్లిదండ్రులు దాతల సాయంతో ఒక లక్షా 80 వేల వరకు డబ్బు సమకూర్చుకొని మిగతా డబ్బు సర్ధుబాటు చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయారట.
అయితే ఓ వ్యక్తి సలహాతో బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ని కలిసి పరిస్థితి వివరించడంతో బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్.. ఆ చిన్నారి వ్యాధి, తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితిని దృష్టికి తీసుకువెళ్ళగా వెంటనే బాలకృష్ణ స్పందించి పాప ఆపరేషన్కు కట్టవలసిన 5 లక్షల 20 వేల రూపాయలు మాఫీ చేయించారు. అంతేకాదు ఆ చిన్నారికి మెరుగైన చికిత్స అందించమని వైద్య సిబ్బందికి ఫోన్ చేసి చెప్పారు. ఈ విషయం తెలిసి బాలయ్య మనసు వెన్న అంటూ మురిసిపోతున్నారు ఆయన ఫ్యాన్స్.
బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అఖండ' సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్డేట్స్ నందమూరి అభిమానులకు ఊపు తెప్పించాయి. ఈ సినిమాతో పాటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో మాస్ ఎంటర్టైనర్ చేసేందుకు రెడీ అయ్యారు బాలయ్య బాబు.