యాప్నగరం

ప‌రుచూరి విజ‌య‌ల‌క్ష్మి మృతి పట్ల చిరంజీవి సంతాపం.. ఆమె మరణం తీరని లోటు అని పేర్కొన్న 'మా'

ప్రముఖ టాలీవుడ్ రచయిత ప‌రుచూరి వెంకటేశ్వరరావు స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి(74) గుండెపోటుతో కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆమె మృతిపై మెగాస్టార్ చిరంజీవి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Samayam Telugu 7 Aug 2020, 2:22 pm
నేటి (శుక్రవారం) ఉద‌యం ప్రముఖ టాలీవుడ్ రచయిత ప‌రుచూరి వెంకటేశ్వరరావు స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి(74) గుండెపోటుతో కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆరోగ్య ప‌రిస్థితి విషమించ‌డంతో హైదరాబాద్‌లోని స్వగృహంలో మృతి చెందారు. విజయలక్ష్మి మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ తమ సంతాపాన్ని తెలియ‌ జేస్తున్నారు.
Samayam Telugu పరుచూరి విజయలక్ష్మి మృతి పట్ల చిరంజీవి సంతాపం
Chiranjeevi condolences on Paruchuri Vijayalakshmi death


తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) త‌మ ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేసింది. విజ‌య‌ల‌క్ష్మి గారి మ‌ర‌ణం ప‌రుచూరి కుటుంబానికి తీర‌ని లోటు అని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సైతం ప‌రుచూరి వెంకటేశ్వరరావుకు ఫోన్‌ చేసి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప‌రుచూరి వెంకటేశ్వరరావు వెన్నంటే ఉంటూ ఆయన విజయంలో విజ‌య‌లక్ష్మి కీలకపాత్ర పోషించిందని అన్నారు.

Also Read: షాకింగ్: ఎవ్వరినీ నమ్మొద్దు.. మోసపోయా అంటూ మరో సినీ నటి ఆత్మహత్య

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ర‌చ‌యిత‌లుగా త‌మ‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పరుచూరి బ్ర‌ద‌ర్స్ (ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌). పరుచూరి బ్రదర్స్‌లో ఒకరైన పరుచూరి వెంకటేశ్వరరావు ఇద్దరిలో పెద్దవారు. మాటల రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడు. ఎన్టీఆర్‌ కాలం మొదలుకొని నేటివరకు కథలు, డైలాగ్స్ రాయడంలో పరుచూరి బ్రదర్స్ ద్వయానికి తిరుగులేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.