యాప్నగరం

సంతోషంగా గడిపే రోజు అతి దగ్గరలో ఉంది: చిరంజీవి

కరోనా క్రైసిస్ ఛారిటీ నుంచి మూడో విడత కూడా నిత్యావసర సరుకులు పంపిణీ అవుతున్నాయి. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతోన్న సినీ కార్మికులకు ఈ సరుకులు అందజేస్తారు.

Samayam Telugu 21 Aug 2020, 6:24 pm
కరోనా వైరస్ తెలుగు సినీ పరిశ్రమను ఘోరంగా దెబ్బతీసింది. కొన్ని కోట్ల వ్యాపారం ఆగిపోయింది. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేక ఎంతో మంది సినీ కార్మికులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారిని ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీని సినీ పెద్దలు ఏర్పాటుచేశారు. ఈ ఛారిటీ ద్వారా సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్‌లో పనిచేసే కార్మికులకు నిత్యావసరాలను అందజేశారు. ఇప్పటికే రెండు విడతల్లో నిత్యావసర సరుకులు అందజేయగా.. ఇప్పుడు మూడో విడత కూడా ఇస్తున్నట్టు చిరంజీవి ప్రకటించారు.
Samayam Telugu చిరంజీవి
Chiranjeevi


‘‘కరోనా క్రైసిస్ ఛారిటీ నుంచి మూడో విడత కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ వినాయక చవితి పండుగ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను’’ అని వెల్లడించారు చిరంజీవి. అలాగే, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను కూడా పోస్ట్ చేశారు. సుమారు 10 వేల మంది కార్మికులకు మూడో విడత సరుకులు అందజేస్తామని పేర్కొన్నారు. కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు ఇచ్చిన దాతలు, సరుకులు పంపిణీలో సహాయం చేసిన వాలంటీర్లకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: ‘బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది’.. షకలక శంకర్ హీరోగా మరో సినిమా

‘‘షూటింగ్స్ ఇంకా మొదలు కాలేదు. ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి. పనిలేక, చేతులో డబ్బాడక చాలా కష్టంగా ఉంది సినీ కార్మికుల పరిస్థితి. అందుకే, CCC తరఫున అందరు కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. ఇప్పటికే పంపిణీ కూడా మొదలుపెట్టాం. ఇక్కడున్న అన్ని యూనియన్లు, సినీ జర్నలిస్టులతో పాటు ఆంధ్రలో ఉన్న సినీ వర్కర్లకు ఎప్పటిలానే ఇస్తూనే.. ఈసారి రెండు రాష్ట్రాల్లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో ఉన్న రిప్రజెంటేటివ్స్, పోస్టర్లు అతికించే కార్మికులకు కూడా అందజేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ మొత్తం కలిపి సుమారు 10 వేల మందికి సరుకులు అందజేస్తాం’’ అని చిరంజీవి వీడియోలో వెల్లడించారు.

ఇప్పుడున్న ఈ పరిస్థితి శాశ్వతం కాదని, తాత్కాలిక కష్టమేనని చిరంజీవి ధైర్యం చెప్పారు. ఈ పరిస్థితిని ఇంకొన్ని రోజులపాటు ఎదుర్కొని ధైర్యంగా నిలబడదామని పిలుపునిచ్చారు. పనిచేసుకుంటూ సంతోషంగా గడిపే రోజు అతి దగ్గరలో ఉందన్నారు. ‘‘మీ కుటుంబానికి ఇప్పుడు ముఖ్యంగా కావాల్సింది మీ అందరి ఆరోగ్యం. మనకేం కాదులే, మనకేం రాదులే అనే నిర్లక్ష్య ధోరణి అస్సలు పనికిరాదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అనుక్షణం అప్రమత్తంతో ఉంటూ మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ మీ కుటుంబానికి మీరు రక్షణగా ఉండండి’’ అని చిరు సూచించారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలకు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించాలని ఆ వినాయకుడిని కోరుకుందాం అని చిరు సూచించారు.
View this post on Instagram Hard times are not over yet, especially for the daily wage workers. At such time, I Thank all the noble souls at #CoronaCrisisCharity who volunteered to pool resources to provide free food supplies to 10K workers for the third time in a row. I salute their compassion🙏🙏 A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on Aug 21, 2020 at 4:53am PDT

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.