యాప్నగరం

Sirivennela Sitaramasastri Death: సాహిత్యానికి ఇది చీకటి రోజు.. సిరివెన్నెల మరణంపై చిరంజీవి భావోద్వేగ సందేశం

సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నింపింది. ఆయన మృతి పట్ల యావత్ సినీ లోకం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అవుతూ ట్విట్టర్‌లో సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు.

Samayam Telugu 30 Nov 2021, 7:03 pm
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నింపింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అవుతూ ట్విట్టర్‌లో సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు.
Samayam Telugu సిరివెన్నెల మరణంపై చిరంజీవి భావోద్వేగ సందేశం
Chiranjeevi- Sirivennela Sitaramasastri


''సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆరు రీజుల క్రితం హాస్పిటల్లో జాయిన్‌ అవ్వడానికి వెళుతున్న సమయంలో నేను ఆయనతో మాట్లాడాను. తన ఆరోగ్యం బాగాలేదని తెలిసి మద్రాసులో ఒక మంచి హాస్పి టల్‌ ఉందని, ఇద్దరం వెళదాం.. అక్కడ జాయిన్‌ అవుదురు గాని అని అన్నాను. ఆయన మిత్రమా, ఈ రీజు ఇక్క డ జాయిన్‌ అవుతాను నెలాఖరులోపు వచ్చేస్తాను. నువ్వు అన్నట్టుగానే అప్పటికి ఉపశమనం రాకపోతే, ఖచ్చితంగా మనిద్దరం కలిసి అక్కడికి వెళ్దాం అన్నారు.

అలా వచ్చెస్తానని వెళ్ళిన మనిషి ఈ విధంగా జీవం లేకుండా వస్తారు అనేది ఊహించ లేకపోయాను. చాలా బాధాకరమైన విషయం ఇది. ఆయనకు అన్నిరకాల మెరుగైన వైద్యం అందివ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయనకు ఫోన్‌ చేస్తే ఎంతో హుషారుగా మాట్లాడారు. అంత ఉత్సాహంగా దాదాపు 20నిముషాల పాటు మాట్లాడితే ఖచ్చితంగా ఏమీ జరగదు అని నేను అనుకున్నాను. ఆ సమయంలో వారి కుమార్తెతో కూడామాట్లాడాను మీతో మాట్లాడాక నాన్నగారు చాలా ఉత్సాహంగా ఉన్నారని ఆమె వెల్లడించారు. నన్ను సీతారామశాస్త్రి గారి కుటుంబంలో వాళ్ళు ఎంతగా అభిమానిస్తారో అనే విషయాన్ని కూడా ఆమె వెల్లడించారు. ఇద్దరూ ఒకటే వయసు వాళ్ళం కావడంతో ఎప్పుడూ ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉండేవారు. ఎప్పు డు కలిసినా చాలా ఆప్యాయంగా మిత్రమా అంటూ పలకరిస్తూ మాట్లాడతారు.

తెలుగు సినీ కళామతల్లికి ఎనలేని సేవలు అందించారు. వేటూరి గారి తర్వాత అంత గప్ప సాహిత్య విలువలను ఈ తరానికి అందించిన గప్ప రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆయన భాషను అర్ధం చేసుకోవడానికి కూడా మనకున్న పరిజ్ఞానం సరిపోదు. అంతటి మేధావి ఆయన. ఎన్నో అవార్డులు, రివార్డులు తన కెరీర్లో అందుకున్న ఆయనకు 2019లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందివ్వగా ఆ రోజున నేను వ్యక్తిగతంగా ఆయన ఇంట్లో చాలాసేపు గడిపాను. సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి వ్యక్తిని కోల్పోతే సొంత బంధువుని కీల్పోయినట్లుగా చాలా దగ్గరి ఆత్మీయుడిని కీల్పోయినట్ట అనిపిస్తోంది. గుండె తరుక్కుపోతోంది.. గుండెంతా బరువెక్కి పోతోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు. ఎంతో మందిని శోక సముద్రంలో ముంచి దూరమైపోయిన ఆయన నిజంగా మనందరికీ, ఈ సాహిత్య లోకమంతటికి అన్యాయం చేశారు. ముఖ్యంగా మా లాంటి మిత్రులకు అన్యాయం చేసి వళ్ళిపోయారు.

ముఖ్యంగా నాకు అత్యంత ఇష్టమైన రుద్రవీణ సినిమాలోని 'తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కీసం' అనే పాటలోలాగా ఆయనే మన అందరినీ వదిలి తరలి వెళ్ళిపోయారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు కానీ సిరివెన్నెలసీతారామశాస్త్రి గారు కానీ ఇలా అర్థాంతరంగా వెళ్లిపోవడం చిత్ర పరిశ్రమకు ఎవరూ పూరించలేని లోటు. భౌతికంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి దూరమయ్యారు కానీ తన పాటలతో ఇంకా ఆయన బతికే ఉన్నారు. తన పాట బతికున్నంతకాలం సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా బతికే ఉంటారు.
అప్పుడు కుడి భుజం పోతే ఇప్పుడు ఎడమ భుజం పోయింది.. సిరివెన్నెల మృతిపై కె. విశ్వనాథ్ ఎమోషనల్
ఆయన సాహిత్యంలో శ్రీశ్రీ గారి పదును కనపడుతుంది. ఈ సమాజాన్ని మేలుళిలిపే విధంగా ఒక శక్తి ఉంటుంది. ఈ సమాజంలో తప్పు ఎత్తి చూపే విధంగా ఆయన సాహిత్యం ఉంటుంది. ఈ సమాజానికి పట్టిన కుళ్ళు కడిగిపారేసే విధంగా ఉంటుంది. అంత పవర్‌ ఆయన సాహిత్యంలోనే కాదు ఆయన మాటల్లోనే కాదు, ఆయన కలంలోనే కాదు ఆయన మనస్తత్వం కూడా దాదాపు అలాగే ఉంటుంది. అలాంటి గప్ప వ్యక్తి గొప్పు కవి మళ్లీ మనకు తారసపడడం కష్టమే. ఆయన ఆ తల్లి సరస్వతీ దేవి వడిలో సేద తీరుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని అన్నారు చిరంజీవి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.