మాటీవీ పేరు, లోగో మారిపోయాయి. ఆదివారం మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన లోగో లాంచింగ్ కార్యక్రమంలో చిరు చేతుల మీదుగానే కొత్త పేరు ప్రకటించడంతోపాటు కొత్త లోగో ఆవిష్కరణ కూడా జరిగింది. మా టీవీ ఛానెల్ని కొనుగోలు చేసిన స్టార్ సంస్థ ఆ రెండు ఛానెళ్ల పేర్లు వచ్చేలా కొత్తగా 'స్టార్ మా' అని కొత్త పేరుని ప్రకటించింది. ఇక ఈ కొత్త లోగోలోనూ మొదట స్టార్ గుర్తు కనిపిస్తుండగా ఆ కిందే యధావిధిగా మా టీవీ లోగోలోని maa అనే అక్షరాలు దర్శనం ఇస్తాయి. ఛానెల్కి ట్యాగ్ లైన్గా "అదే బంధం.. సరికొత్త ఉత్తేజం" అనే పదాలని కింద చూడవచ్చు.
మాటీవీ కొత్త పేరు, లోగో లాంచ్ చేసిన అనంతరం అక్కడున్న మీడియాతో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి.. మాటీవీ ఛానెల్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. " మాటీవీ ప్రారంభం నుంచి నేను కూడా మాటీవీలో ఓ భాగంగానే వుంటూ వచ్చానన్న చిరు.. ఇప్పుడిలా తన చేతులమీదుగానే మా టీవీ కొత్త టైటిల్, లోగో లాంచింగ్ జరగడం అనేది తనకి చాలా చాలా సంతోషాన్నిచ్చింది" అని ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా స్టార్ మా యాజమాన్యం, ప్రతినిథులకి ఆల్ ది బెస్ట్ చెప్పారు చిరు.
ఇకపై 'స్టార్ మా' టీవీ అనేది 'స్టార్ ఇండియా' వ్యాపారంలో ఓ భాగం కానుండగా... గ్లోబల్ మీడియా కంపెనీ అయిన 'ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్'కి పూర్తి అనుబంధ సంస్థగా స్టార్ ఇండియా పనిచేస్తోంది. దేశంలో 7 భాషల్లో 40కిపైగా ఛానెల్స్ని కలిగివున్న తమ స్టార్ ఇండియా గ్రూప్... ప్రతీవారం భారత్తోపాటుగా ప్రపంచవ్యాప్తంగా వున్న 100 దేశాల్లో వున్న దాదాపు 720 మిలియన్ వీక్షకులని చేరుకుంటున్నట్టుగా ప్రకటించింది.
మాటీవీ కొత్త పేరు, లోగో లాంచ్ చేసిన అనంతరం అక్కడున్న మీడియాతో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి.. మాటీవీ ఛానెల్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. " మాటీవీ ప్రారంభం నుంచి నేను కూడా మాటీవీలో ఓ భాగంగానే వుంటూ వచ్చానన్న చిరు.. ఇప్పుడిలా తన చేతులమీదుగానే మా టీవీ కొత్త టైటిల్, లోగో లాంచింగ్ జరగడం అనేది తనకి చాలా చాలా సంతోషాన్నిచ్చింది" అని ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా స్టార్ మా యాజమాన్యం, ప్రతినిథులకి ఆల్ ది బెస్ట్ చెప్పారు చిరు.
ఇకపై 'స్టార్ మా' టీవీ అనేది 'స్టార్ ఇండియా' వ్యాపారంలో ఓ భాగం కానుండగా... గ్లోబల్ మీడియా కంపెనీ అయిన 'ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్'కి పూర్తి అనుబంధ సంస్థగా స్టార్ ఇండియా పనిచేస్తోంది. దేశంలో 7 భాషల్లో 40కిపైగా ఛానెల్స్ని కలిగివున్న తమ స్టార్ ఇండియా గ్రూప్... ప్రతీవారం భారత్తోపాటుగా ప్రపంచవ్యాప్తంగా వున్న 100 దేశాల్లో వున్న దాదాపు 720 మిలియన్ వీక్షకులని చేరుకుంటున్నట్టుగా ప్రకటించింది.