యాప్నగరం

హరికృష్ణ పార్థివ దేహానికి చిరు, పవన్, చరణ్ తదితరుల నివాళి..

నల్లగొండ జిల్లా అన్నెపర్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణ పార్థివ దేహానికి చిరంజీవి, పవన్, చరణ్ తదితరులు నివాళులు అర్పించారు.

Samayam Telugu 30 Aug 2018, 8:05 am
హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నందమూరి హరికృష్ణ పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సినీనటులు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామోజీ రావు, మురళీ మోహన్‌, రామ్‌ చరణ్‌, సుమన్‌ తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘ఇది చాలా దుర్దినం. మంచి మిత్రుణ్ని కోల్పోయాం. సోదర సమానుడైన హరికృష్ణ అకాల మరణం కలచివేసింది’ అన్నారు.
Samayam Telugu chiru harikrishna


రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందడం చాలా దురదృష్టకరమని, చాలా బాధగా ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో హరికృష్ణ ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంఘటనను మర్చిపోలేమన్నారు.
హరికృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు మెహదీపట్నంలోని ఆయన నివాసానికి సినీ, రాజకీయ ప్రముఖులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి, అనుష్క, రానా లాంటి పలువురు సినీ నటులు హరికృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.