యాప్నగరం

చరణ్‌కు ప్రేమతో.. ఇక వేదిక మీద ఇరగదీస్తాడు!

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రంగస్థలం’ ప్రీ రిలీజ్ వేడుక విశాఖ తీరంలో మొదలైపోయింది.

Samayam Telugu 18 Mar 2018, 6:33 pm
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రంగస్థలం’ ప్రీ రిలీజ్ వేడుక విశాఖ తీరంలో మొదలైపోయింది. ఇప్పటికే మెగాస్టార్ అభిమానులతో పాటు విశాఖ ప్రజలతో ఆర్కే బీచ్ కిక్కిరిసిపోయింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న చిరంజీవితో పాటు రామ్ చరణ్, ఉపాసన, సమంత ఇప్పటికే విశాఖపట్నం చేరుకున్నారు. అయితే ఈ సందర్భంగా చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసుకున్నారు. వాటిలో ఒక ఫొటో మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు వస్తున్న క్రమంలో రామ్ చరణ్, సమంత, చిరంజీవి బర్గర్లు ఆరగించారు.
Samayam Telugu chiranjeevi ram charan on the way to vizag upasana shares pics
చరణ్‌కు ప్రేమతో.. ఇక వేదిక మీద ఇరగదీస్తాడు!


అయితే చరణ్‌కు తండ్రి చిరంజీవి స్వయంగా బర్గర్ తినిపించారు. తండ్రి చేత్తో అందించిన ఆ బర్గర్‌ను చరణ్ ఆస్వాదిస్తున్న ఫొటో మెగా అభిమానులను కట్టిపడేస్తోంది. తండ్రి ఎంతో ప్రేమతో అందించిన ఆ బర్గర్ తిన్న చరణ్ ఇక ప్రీ రిలీజ్ వేదిక మీద స్పీచ్ ఇరగదీస్తాడని అందరూ అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే, నేడు ప్రీ రిలీజ్ వేడుకతో పాటు ‘రంగస్థలం’ థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల కానుంది. ఇప్పటికే టీజర్, పాటలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ట్రైలర్‌తో ఏం మాయ చేస్తుందో చూడాలి. భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 30న ‘రంగస్థలం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Behind the scenes of #rangasthalam pre release ❤️😘 all the stars letting loose today. #megastarchiranjeevi #ramcharan @Samanthaprabhu2 pic.twitter.com/Vj57616wIo — Upasana Kamineni (@upasanakonidela) March 18, 2018

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.