సీనియర్ హీరో అయినప్పటికీ నేటి హీరోలతో పోటీపడుతూ అటు వెండితెరపై ఇటు సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉంటున్నారు చిరంజీవి. లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చా అన్నట్లుగా ట్విట్టర్ ఖాతాలో వరుస పోస్టులు పెడుతూ సమాజంలోని పలు విషయాలపై స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రకృతిపై ప్రేమ కురిపిస్తూ ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు.
తన ఇంటి నుంచి సూర్యోదయాన్ని వీడియో తీసి ఆ అందమైన దృశ్యాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ''రోజులు, నెలలు, సంవత్సరాలు, శతాబ్దాలు పూర్తయినా సూర్యోదయం, సూర్యాస్తమయాల వెనకున్న ఆ అందాన్ని, అద్భుతాన్ని వివరించడానికి మాటలు చాలవు. ఈ ప్రపంచంలో వెలకట్టలేని అందమైన దృశ్యాలవి. ఈ దృశ్యాలను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. నేటి ఉదయం మా ఇంటి నుంచి తీసిన ఈ అందమైన వీడియోను మీతో పంచుకుంటున్నా'' అని పేర్కొన్నారు చిరంజీవి. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఇక చిరంజీవి కెరీర్ విషయానికొస్తే.. కొరటాల శివతో భారీ ప్రాజెక్టు 'ఆచార్య' చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, రామ్ చరణ్ 'సిద్ధ' అనే ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ బాణీలు కడుతున్నారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మే 13వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
తన ఇంటి నుంచి సూర్యోదయాన్ని వీడియో తీసి ఆ అందమైన దృశ్యాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ''రోజులు, నెలలు, సంవత్సరాలు, శతాబ్దాలు పూర్తయినా సూర్యోదయం, సూర్యాస్తమయాల వెనకున్న ఆ అందాన్ని, అద్భుతాన్ని వివరించడానికి మాటలు చాలవు. ఈ ప్రపంచంలో వెలకట్టలేని అందమైన దృశ్యాలవి. ఈ దృశ్యాలను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. నేటి ఉదయం మా ఇంటి నుంచి తీసిన ఈ అందమైన వీడియోను మీతో పంచుకుంటున్నా'' అని పేర్కొన్నారు చిరంజీవి. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఇక చిరంజీవి కెరీర్ విషయానికొస్తే.. కొరటాల శివతో భారీ ప్రాజెక్టు 'ఆచార్య' చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, రామ్ చరణ్ 'సిద్ధ' అనే ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ బాణీలు కడుతున్నారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మే 13వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.