కరోనా లాక్ డౌన్తో అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అనేక రకాల ఫేక్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఈ ఫేక్ వార్తలకు సెలబ్రిటీలు సైతం బలవుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఉదయం నుంచి అన్ని రకాల వెబ్ సైట్లు, న్యూస్ ఛానల్స్, కొన్ని పేపర్స్లో ఓ వార్త ప్రత్యక్షమైంది. అదే మెగాస్టార్ తల్లి అంజనా దేవి కరోనా మాస్కులు తయారు చేస్తున్నారని. సమాజ సేవలో మెగాస్టార్ తల్లి అనే క్యాప్షన్లో ఈ వార్త అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో కనిపించింది. అయితే ఈ వార్తపై మెగాస్టార్ చిరు క్లారిటీ ఇచ్చారు.
‘ప్రెస్, కొన్ని సోషల్ మీడియా ఛానల్స్లో మా అమ్మ మనవత్వం పేరిట కొన్ని కథనాలు వచ్చాయి. నిజానికి ఆమె నా తల్లి కాదు. కానీ ఏ తల్లి ఇంత గొప్ప పని చేస్తుందో ఆ తల్లికి మాత్రం నా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే’అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. తన తల్లిపై ఫేక్ వార్త వచ్చిందని సింపుల్గా చెప్పి వదిలేయకుండా అలా చేస్తున్న తల్లికి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్ది నిజంగా గొప్ప మనసు అంటూ నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.
ఇక చిరు తల్లిపై వచ్చిన ఫేక్ వార్తను ఓ సారి పరిశీలిస్తే... మెగాస్టార్ తల్లి సైతం కరోనా సాయం చేస్తున్నవారితో భాగస్వామ్యులు అయ్యారని వార్త ఒకటి వచ్చింది. మానవత్వాన్ని చూపుతూ ఆమె కూడా ముందుకు వచ్చారని.. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి కరోనా కోసం మాస్కులు తయారు చేస్తున్నారని ఓ వార్త హల్ చల్ చేసింది. ఆమె గత 3 రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి 700 మాస్క్లు కుట్టారని కూడా ఆ వార్తలో పేర్కొన్నారు. వీటిని అవసరమైన వారికి అందజేస్తున్నట్లు కూడా తెలిపారు. తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె సమాజం కోసం తనవంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. దేశంపట్ల, సమాజం పట్ల ఆమె చూపుతున్న బాధ్యతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారని ఫేక్ వార్త ఎవరూ సృష్టించి సోషల్ మీడియాలో తెగ షేర్ చేశారు.
‘ప్రెస్, కొన్ని సోషల్ మీడియా ఛానల్స్లో మా అమ్మ మనవత్వం పేరిట కొన్ని కథనాలు వచ్చాయి. నిజానికి ఆమె నా తల్లి కాదు. కానీ ఏ తల్లి ఇంత గొప్ప పని చేస్తుందో ఆ తల్లికి మాత్రం నా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే’అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. తన తల్లిపై ఫేక్ వార్త వచ్చిందని సింపుల్గా చెప్పి వదిలేయకుండా అలా చేస్తున్న తల్లికి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్ది నిజంగా గొప్ప మనసు అంటూ నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.
ఇక చిరు తల్లిపై వచ్చిన ఫేక్ వార్తను ఓ సారి పరిశీలిస్తే... మెగాస్టార్ తల్లి సైతం కరోనా సాయం చేస్తున్నవారితో భాగస్వామ్యులు అయ్యారని వార్త ఒకటి వచ్చింది. మానవత్వాన్ని చూపుతూ ఆమె కూడా ముందుకు వచ్చారని.. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి కరోనా కోసం మాస్కులు తయారు చేస్తున్నారని ఓ వార్త హల్ చల్ చేసింది. ఆమె గత 3 రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి 700 మాస్క్లు కుట్టారని కూడా ఆ వార్తలో పేర్కొన్నారు. వీటిని అవసరమైన వారికి అందజేస్తున్నట్లు కూడా తెలిపారు. తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె సమాజం కోసం తనవంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. దేశంపట్ల, సమాజం పట్ల ఆమె చూపుతున్న బాధ్యతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారని ఫేక్ వార్త ఎవరూ సృష్టించి సోషల్ మీడియాలో తెగ షేర్ చేశారు.