యాప్నగరం

ప్రారంభమైన ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ప్రారంభమైంది.

Samayam Telugu 7 Jan 2017, 6:26 pm
మెగాస్టార్ చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ప్రారంభమైంది. గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌ థీమ్ పార్కులో జరుగుతున్న ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఎందరో అతిథులుగా హాజరయ్యారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్ర నిర్మాత అశ్వనీదత్, మరో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య చేతుల మీదుగా నీరు 'నీరు... రైతు కంట నీరు' సాంగ్ ఏవీ ప్లే చేయడంతో ఈ కార్యక్రమం ఆరంభమైంది.
Samayam Telugu chiranjeevis khaidi no 150 movie pre release event at hailand in guntur
ప్రారంభమైన ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్


అనంతరం ప్రముఖ సింగర్స్ సింహ, సాయిశిల్పలతోపాటు ఇతర గాయనీ, గాయకుల లైవ్ పర్‌ఫార్మెన్స్‌, డ్యాన్సులతో ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఊపందుకుంది. ఈ ఈవెంట్‌కి హాజరవడానికి మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకి వచ్చారు. అక్కడి నుంచి అభిమానుల ఘన స్వాగతం, భారీ ర్యాలీ మధ్యహాయ్‌ల్యాండ్ రిసార్ట్స్‌కి చేరుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.